CPI Narayana: ఇదే జరగకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు ఉండేవారు.
CPI Narayana criticizes BJP party: జీ-20 నాయకత్వం వహించే అవకాశం భారతదేశానికి రొటేషన్ లో భాగంగా వచ్చింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఉండటం వల్లే అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు సీపీఐ జాతీయ నేత నారాయణ. సైద్ధాంతికంగా బీజేపీ వ్యతిరేకించినప్పటికీ ఇవాళ్టి సమావేశంలో డీ. రాజా పాల్గొంటున్నారని అన్నారు. జీ 20 సదస్సులో మహిళా సాధికారత అనే అంశం ఉందని.. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా ఈ అంశంపై మాట్లాడే నైతిక అర్హత భారతదేశానికి ఉండదని అన్నారు. పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న బీజేపీ ఈ బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Revanth Reddy: నన్ను జైల్లో పెట్టి.. నా బిడ్డ లగ్నపత్రికకు పోకుండా చేశారు
Also Read
గవర్నర్ల వ్యవస్తను దుర్వినియోగం అంశంపై మా పార్టీ చర్చించిందని.. వందేళ్ల సీపీఐ ప్రమాణంలో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు చేపడతాం అని అన్నారు. 10 లక్షల సభ్యత్వాలను చేపట్టాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వెల్లడించారు. రాజ్యాంగ వ్యవస్థలను రక్షించేందుకు పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒకప్పుడు పార్లమెంట్ లో కమ్యూనిస్టులకు 60కి పైగా స్థానాలు ఉండేవని.. ప్రాంతీయ వాదం, మతతత్వం, డబ్బు ప్రభావం పెరిగిందని అన్నారు. కమ్యూనిస్టుల ప్రభావం తగ్గడానికి ఇదే కారణం అని అన్నారు.
కమ్యూనిస్టు పార్టీల చీలిక ప్రాంతీయ పార్టీలకు ఊతమిచ్చిందని..కమ్యూనిస్టుల బలహీనతల వల్లే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని ఆయన అన్నారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్ట్ పార్టీలే నిలబడేవని కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయాలు వ్యాపారమయం అయ్యాయని..కాబట్టి ఒకరిద్దరు కమ్యూనిస్టులు పార్టీ వీడే అవకాశం ఉండొచ్చని అన్నారు. కానీ ప్రజా ఉద్యమాల నిర్మాణంలో కమ్యూనిస్టులు నేటికి బలంగా ఉన్నారని అన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో