కరోనా వైరస్ నిత్యం మార్పులు చెందుతూ కొత్త కొత్త వేరియంట్లుగా మార్పులు చెందుతున్న సంగతి తెలిసిందే. జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కొల్పోవడం వంటి లక్షణాలను కరోనా లక్షణాలుగా ఇప్పటి వరకూ పేర్కొంటూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ లిస్ట్ లో మరికొన్ని లక్షణాలు కూడా చేరాయి. కొంత మందిలో నాలుక ఎర్రబారడం, ఎండిపోవడం, దురదగా అనిపించడం, నాలుకపై గాయాలు కావడం వంటివి కూడా కరోనా లక్షణాలుగా గుర్తించారు. ఈ లక్షణాలు ఉంటే కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలను కొవిడ్ టంగ్ అని చెప్తున్నారు. ఈ లక్షణాలున్న వారిలో నీరసం కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ టంగ్ లక్షణాలకు గల కారణాలు ఎంటి? కరోనా కారణంగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై లోతైన అద్యయనం చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.