Covid 19: పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ ఆంక్షల బాట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. వందల్లోకి వచ్చాయి.. అయితే, ఇప్పుడు మళ్లీ టెన్షన్ పెట్టే విధంగా వేలలోకి వెళ్తున్నాయి.. కరోనా కేసులు పెరుగుతుండటంతో… మరోసారి ఆంక్షల వైపు ఢిల్లీలో అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రోజు వారి కేసులు సంఖ్య రెట్టింపవుతోంది. వైరస్ ఎఫెక్ట్ తీవ్రంగా లేక పోయినప్పటికీ… ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు అమల్లో లేవు. మాస్కుల వినియోగం తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రతి రోజూ 5వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో.. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇవాళ సమావేశం కానుంది. మాస్క్ వాడకంతో పాటు కరోనా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రకటించనుంది డీడీఎంఏ.
Read Also: Troubles to TRS: అధికార పార్టీకి తలనొప్పులు..! ఇబ్బందిగా ఆ మూడు ఘటనలు..!
Also Read
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
వాక్సినేషన్ జరుగుతుండటంతో… కరోనా ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఏ వేరియంట్ ఎలా ఉంటుందోననే టెన్షన్ పడుతున్నారు. అందుకే వేరియంట్ ఏదైనా కరోనా జాగ్రత్తల విషయంలో లైట్ తీసుకోవద్దని డిసైడ్ అయింది ఢిల్లీ సర్కార్. ఇప్పటికే స్కూళ్లలో పలు కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరస్ లక్షణాలున్న స్టూడెంట్స్ ను స్కూళ్లకు పంపొద్దని తల్లిదండ్రులను కోరుతున్నారు. కోవిడ్ సోకినవారిలో అధికశాతం జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మాస్కులు ధరించకపోవడమే కేసుల పెరుగుదలకు అసలు కారణమని అంచనా వేస్తున్నారు. కోవిడ్ సోకినవారు… 5 రోజుల్లో కోలుకుంటున్నట్లు తేలింది. కేసుల పెరుగుదల వెనుక కొత్త వేరియంట్లు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు పలు శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించారు. మరోవైపు కరోనా వైరస్ సోకిన బాధితుల్లో 30శాతం మందిలో దీర్ఘకాలిక కొవిడ్ వెంటాడుతున్నట్లు తాజా అధ్యయనం తేలింది. ఇన్ఫెక్షన్ బారినపడిన నుంచి నెలల తరబడి కొన్ని లక్షణాలు వారిని వేధిస్తున్నాయని తెలిపింది. కోవిడ్ సోకిన తర్వాత ప్రభావాలపై అమెరికా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.. మళ్లీ ఆంక్షాల బాట పడుతుండడంతో.. ఎలాంటి ఆంక్షలు విధించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
- Tags
- Covid 19
- Covid Sanctions
- Delhi
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
-
Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
-
PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!