Congress: ఎంపీలో మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు.. కోవిడ్ లాక్డౌన్ ఆలస్యం చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోవిడ్ మహమ్మారి లాక్డౌన్ని ఆలస్యం చేశారని బీజేపీై ఆరోపణలు గుప్పించారు. జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 2020లో మధ్యప్రదేశ్లో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత సీఎం శివరాజ్సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
2020, మార్చి కోవిడ్-19 మహమ్మారి మూలంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అయితే సరైన సమయంలో కేంద్రంలోని బీజేపీ లాక్ డౌన్ విధించలేదని, మధ్యప్రదేశ్లో తమ ప్రభుత్వం పడిపోతుందని నిర్ధారించడానికి 10 రోజలు సమయం ఇచ్చారని, ఇది కుట్రని జైరాం రమేష్ ఆరోపించారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
Read Also: Haryana: ప్రిన్సిపాల్ కాదు కీచకుడు..50 మంది బాలికలపై లైంగిక వేధింపులు..
ఎంపీలో బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, మళ్లీ కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెడతారని ఆయన మీడియాతో అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస 6 గ్యారెంటీలను ఇచ్చింది, వాటిని అమలు చేసింది, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో 12 హామీలు ఇచ్చామని అన్నారు. రూ.500లో ఎల్పీజీ సిలిండర్, మహిళలకు రూ.1500, రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), నిరుద్యోగ యువతకు భృతి, పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు మొదలైన హామీలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ హామీలను ప్రధాని మోడీ ఉచితాలుగా అభివర్ణించారని, అయితే ప్రధాని మోడీ వాటిని స్వీకరిస్తున్నారంటూ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల కోసమే పొత్తు పెట్టుకున్నామని, ఇండియా కూటమి గురించి మాట్లాడారు. కాంగ్రెస్తో పాటు 25 కంటే ఎక్కువ పార్టీలు ఉన్న ఇండియా కూటమి ప్రజాస్వామ్య కూటమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని, కర్ణాటక గెలుపుకు సహకరించిందని, వచ్చే ఐదు రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మేము బీజేపీతోనే కాడు, ఈడీ, సీబీఐలతో కూడా పోరాడుతున్నామని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!