Corona cases in india: దేశంలో స్వల్పంగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత రెండు రోజులతో పోలిస్తే రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,395 మంది మహమ్మారి బారిన పడ్దారు. ఒక్క రోజులోనే 6,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 33 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. నిన్న ఇండియాలో కేవలం 5,379 కొత్త కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. తాజాగా కేసుల సంఖ్య 6 వేలను దాటింది.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు బాగా పెరిగింది. 98.7 శాతం రికవరీలు పెరిగాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50,342 కు పడిపోయింది. మొత్తం కేసులో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 0.11 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.88 శాతంగా ఉంది. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో మొత్తంగా 4,44,72,241 కరోనా కేసులు నమోదు అవ్వగా.. వీరిలో 5,28,090 చనిపోగా… 4,39,00,204 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Read Also: Corona: కోవిడ్ ప్రమాదాన్ని విటమిన్-డి తగ్గించలేదు.. తాజా అధ్యయనంలో వెల్లడి
దేశంలో ఇప్పటి వరకు అర్హులైన వారికి 214.27 కోట్ల వాక్సినేషన్ డోసులు ఇచ్చారు. నిన్న ఒక్క రోజే 36,31,977 కరోనా వ్యాక్సినేషన్ అందించారు. 3,25,602 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇక ప్రపంచంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియాల్లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. రోజుకు అక్కడ లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 61,18,59,477 కేసులు నమోదు కాగా వీరిలో 65,09,112 మంది మరణించారు. 58,94,63,266 మంది కోలుకున్నారు.