Covid-19 Alert: మళ్లీ కరోనా విజృంభణ.. వెయ్యి కేసులు నమోదు
- మళ్లీ కరోనా విజృంభణ.. వెయ్యి కేసులు నమోదు
- దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 1,009 యాక్టివ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. మళ్లీ చాపకింద నీరులా పాకుతోంది. కోవిడ్ పూర్తిగా అంతరించిపోయిందన్న భావనలో ఉన్న ప్రజలకు మళ్లీ షాకిస్తోంది. కొత్త వేరియంట్రూపంలో ప్రజలకు దడ పుట్టిస్తోంది. కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న కేసులు.. మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. మొదటి వేవ్, సెకండ్ వేవ్ కారణంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాల్లో కోవిడ్ విషాదాన్ని నింపి వెళ్లింది. ఇప్పుడిప్పుడే మనుషులు తిరిగి నార్మల్ స్థితికి వస్తున్న తరుణంలో మరోసారి కరోనా వార్త ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరిగాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Dil Raju: అసలు ఈ థియేటర్ల వివాదం అక్కడే మొదలైంది!
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 1,009 యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల 752 కేసులండగా.. సడన్గా ఆ సంఖ్య వెయ్యికి పైగా దాటి పోయింది. దీంతో మరోసారి ప్రజల్లో భయాందోళన మొదలైంది. లాక్డౌన్లాంటి పరిస్థితులు తలెత్తుతాయేమోనని ఆలోచన మొదలైంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం అత్యధికంగా కేరళలో 430 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కేరళ అగ్ర స్థానంలో ఉన్నట్లుగా చెప్పింది. ఇక పశ్చిమ బెంగాల్లో 11 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Minister Ponnam: రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం కుల గణన సర్వే చేస్తోంది..
రోగులంతా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రస్తుతం రోగులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక పెరుగుతున్న కోవిడ్ కేసులతో భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 104 కేసులు ఉన్నాయని.. వీటిని ఎదుర్కోవడానికి ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని.. ప్రజలకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో మహారాష్ట్రలో 209 కేసులు, ఢిల్లీలో 104 కేసులు, గుజరాత్లో 83 కేసులు, కర్ణాటకలో 47 కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!