Covid-19 Alert: మళ్లీ కరోనా విజృంభణ.. వెయ్యి కేసులు నమోదు
- మళ్లీ కరోనా విజృంభణ.. వెయ్యి కేసులు నమోదు
- దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 1,009 యాక్టివ్ కేసులు
భారతదేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. మళ్లీ చాపకింద నీరులా పాకుతోంది. కోవిడ్ పూర్తిగా అంతరించిపోయిందన్న భావనలో ఉన్న ప్రజలకు మళ్లీ షాకిస్తోంది. కొత్త వేరియంట్రూపంలో ప్రజలకు దడ పుట్టిస్తోంది. కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న కేసులు.. మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. మొదటి వేవ్, సెకండ్ వేవ్ కారణంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాల్లో కోవిడ్ విషాదాన్ని నింపి వెళ్లింది. ఇప్పుడిప్పుడే మనుషులు తిరిగి నార్మల్ స్థితికి వస్తున్న తరుణంలో మరోసారి కరోనా వార్త ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరిగాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Dil Raju: అసలు ఈ థియేటర్ల వివాదం అక్కడే మొదలైంది!
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 1,009 యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల 752 కేసులండగా.. సడన్గా ఆ సంఖ్య వెయ్యికి పైగా దాటి పోయింది. దీంతో మరోసారి ప్రజల్లో భయాందోళన మొదలైంది. లాక్డౌన్లాంటి పరిస్థితులు తలెత్తుతాయేమోనని ఆలోచన మొదలైంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం అత్యధికంగా కేరళలో 430 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కేరళ అగ్ర స్థానంలో ఉన్నట్లుగా చెప్పింది. ఇక పశ్చిమ బెంగాల్లో 11 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Minister Ponnam: రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం కుల గణన సర్వే చేస్తోంది..
రోగులంతా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రస్తుతం రోగులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక పెరుగుతున్న కోవిడ్ కేసులతో భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 104 కేసులు ఉన్నాయని.. వీటిని ఎదుర్కోవడానికి ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని.. ప్రజలకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో మహారాష్ట్రలో 209 కేసులు, ఢిల్లీలో 104 కేసులు, గుజరాత్లో 83 కేసులు, కర్ణాటకలో 47 కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!