భారతదేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. మళ్లీ చాపకింద నీరులా పాకుతోంది. కోవిడ్ పూర్తిగా అంతరించిపోయిందన్న భావనలో ఉన్న ప్రజలకు మళ్లీ షాకిస్తోంది. కొత్త వేరియంట్రూపంలో ప్రజలకు దడ పుట్టిస్తోంది. కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న కేసులు.. మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. మొదటి వేవ్, సెకండ్ వేవ్ కారణంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాల్లో కోవిడ్ విషాదాన్ని నింపి వెళ్లింది. ఇప్పుడిప్పుడే మనుషులు తిరిగి నార్మల్ స్థితికి వస్తున్న తరుణంలో మరోసారి కరోనా వార్త ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరిగాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Dil Raju: అసలు ఈ థియేటర్ల వివాదం అక్కడే మొదలైంది!
సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 1,009 యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల 752 కేసులండగా.. సడన్గా ఆ సంఖ్య వెయ్యికి పైగా దాటి పోయింది. దీంతో మరోసారి ప్రజల్లో భయాందోళన మొదలైంది. లాక్డౌన్లాంటి పరిస్థితులు తలెత్తుతాయేమోనని ఆలోచన మొదలైంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం అత్యధికంగా కేరళలో 430 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కేరళ అగ్ర స్థానంలో ఉన్నట్లుగా చెప్పింది. ఇక పశ్చిమ బెంగాల్లో 11 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Minister Ponnam: రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం కుల గణన సర్వే చేస్తోంది..
రోగులంతా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రస్తుతం రోగులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక పెరుగుతున్న కోవిడ్ కేసులతో భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 104 కేసులు ఉన్నాయని.. వీటిని ఎదుర్కోవడానికి ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని.. ప్రజలకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో మహారాష్ట్రలో 209 కేసులు, ఢిల్లీలో 104 కేసులు, గుజరాత్లో 83 కేసులు, కర్ణాటకలో 47 కేసులు నమోదయ్యాయి.