PM Modi: కాంగ్రెస్ చేసిన పాపాలకు ప్రజలు శిక్షిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ చేసిన పాపాలకు దేశం ఆ పార్టీని శిక్షిస్తోందని, ఒకప్పడు 400 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ, ఈ లోక్సభ ఎన్నికల్లో కనీసం 300 స్థానాల్లో పోటీ చేయలేకపోయిందని పీఎం మోడీ అన్నారు. మొదటి దశ ఓటింగ్లో రాజస్థాన్లో సగం మంది ప్రజలు కాంగ్రెస్ని శాసించారు, దేశభక్తి నిండిన రాజస్థాన్ ప్రజలకు కాంగ్రెస్ ఎప్పుడూ దేశాన్ని శక్తివంతం చేయదనే విషయం తెలుసని ఆయన అన్నారు. జలోల్ జిల్లాలో జరిగి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Sunita Kejriwal: కేజ్రీవాల్ భార్య సంచలన ఆరోపణలు.. భోజనంపై నిఘా, చంపేందుకు కుట్ర..
Also Read
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
2014కి ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రావాలని దేశం కోరుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ ఆశ్రిత పక్షపాతం, అవినీతి చెదపురుగులను వ్యాప్తి చేయడం ద్వారా దేశాన్ని భ్రష్టపట్టించిదని, ఈ రోజు దేశ ప్రజలు కాంగ్రెస్పై కోపంతో ఉన్నారని, ఆ పార్టీ చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆపార్టీ ఇప్పుడు 543 సీట్లలో 300 సీట్లకు సైతం పోటీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.
బీజేపీ అభ్యర్థి లుంబారామ్ చౌదరికి మద్దతుగా ఈ రోజు జలోర్ జిల్లా భిన్మల్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. రాజస్థాన్లోని 25 లోక్సభ స్థానాలకు మొదటిదశలో 12 స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరగగా.. మిగిలిన 13 స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. దేశం మొత్తం 543 స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.
తాజావార్తలు
-
Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
-
Sukhbir Singh Badal: నాందేడ్లో సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి
-
Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!