PM Modi: కాంగ్రెస్ చేసిన పాపాలకు ప్రజలు శిక్షిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ చేసిన పాపాలకు దేశం ఆ పార్టీని శిక్షిస్తోందని, ఒకప్పడు 400 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ, ఈ లోక్సభ ఎన్నికల్లో కనీసం 300 స్థానాల్లో పోటీ చేయలేకపోయిందని పీఎం మోడీ అన్నారు. మొదటి దశ ఓటింగ్లో రాజస్థాన్లో సగం మంది ప్రజలు కాంగ్రెస్ని శాసించారు, దేశభక్తి నిండిన రాజస్థాన్ ప్రజలకు కాంగ్రెస్ ఎప్పుడూ దేశాన్ని శక్తివంతం చేయదనే విషయం తెలుసని ఆయన అన్నారు. జలోల్ జిల్లాలో జరిగి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Sunita Kejriwal: కేజ్రీవాల్ భార్య సంచలన ఆరోపణలు.. భోజనంపై నిఘా, చంపేందుకు కుట్ర..
Also Read
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
2014కి ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రావాలని దేశం కోరుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ ఆశ్రిత పక్షపాతం, అవినీతి చెదపురుగులను వ్యాప్తి చేయడం ద్వారా దేశాన్ని భ్రష్టపట్టించిదని, ఈ రోజు దేశ ప్రజలు కాంగ్రెస్పై కోపంతో ఉన్నారని, ఆ పార్టీ చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆపార్టీ ఇప్పుడు 543 సీట్లలో 300 సీట్లకు సైతం పోటీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.
బీజేపీ అభ్యర్థి లుంబారామ్ చౌదరికి మద్దతుగా ఈ రోజు జలోర్ జిల్లా భిన్మల్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. రాజస్థాన్లోని 25 లోక్సభ స్థానాలకు మొదటిదశలో 12 స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరగగా.. మిగిలిన 13 స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. దేశం మొత్తం 543 స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!