Sunita Kejriwal: కేజ్రీవాల్ భార్య సంచలన ఆరోపణలు.. భోజనంపై నిఘా, చంపేందుకు కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రవాల్ని చంపేందుకు కుట్ర పన్నారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టార్గెట్గా విరుచుకుపడ్డారు. తీహార్ జైలులో తన భర్తను చంపడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రతీ భోజనాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారని ఆమె అన్నారు.
‘‘అతని భోజనంపై కెమెరాలు అమర్చారు. తినే ప్రతీ ముద్దను పర్యవేక్షిస్తున్నారు. ఇది చాలా సిగ్గు చేటు. షుగర్ పేషెంట్గా ఉండీ 12 ఏళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నా, తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ తిరస్కరిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని చంపాలనుకుంటున్నారు.’’ అని సునీతా కేజ్రీవాల్ రాంచీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో ఆరోపించారు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను దోషులుగా నిరూపించకుండా జైలులో పెట్టారని, ఇది నియంతృత్వ పాలన అని విమర్శించారు.
Also Read
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
Read Also: Amit Shah: బీహార్ని “లాంతరు” యుగానికి తీసుకెళ్లాని ఇండి కూటమి భావిస్తోంది..
నా భర్త చేసిన తప్పేంటి.. మంచి విద్య, వైద్య సదుపాయాలను కల్పిండమేనా..? అని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజల కోసం అరవింద్ కేజ్రీవాల్ తన జీవితాన్ని పణంగా పెట్టారని ఆమె అన్నారు. అతను ఐఐటీ గ్రాడ్యుయేట్, అతను విదేశాలకు వెళ్లవచ్చు, కానీ తను దేశభక్తికి ప్రాధాన్యత ఇస్తారని, ఐఆర్ఎస్ అధికారిగా ఉండీ, ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగాన్ని వదిలేశారని చెప్పారు. అతను ప్రజల కోసం జీవితాన్ని పణంగా పెట్టారని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతను తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, ఆప్ నేతలు మాత్రం ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని, చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే, లిక్కర్ స్కాములో కీలక పాత్రధారి సీఎం కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు ఆయన మెడికల్ సమస్యలను చూపించి బెయిల్ పొందేందుకు షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ స్వీట్లు, మామిడిపండ్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నాడని ఈడీ ఇటీవల కోర్టుకు వెల్లడించింది.
తాజావార్తలు
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!