Assembly By Poll Result: కొనసాగుతున్న బైపోల్ ఓట్ల లెక్కింపు..
- 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..
- పశ్చిమ బెంగాల్ 4.. హిమాచల్ ప్రదేశ్ 3.. ఉత్తరాఖండ్ 2తో పాటు..
- బీహర్.. తమిళనాడు.. పంజాబ్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఓట్ల లెక్కింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assembly By Poll Result: బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10వ తేదీన జరిగిన ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, ఇవాళ (శనివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎలక్షన్స్ పై దేశంలో ఆసక్తి నెలకొంది. ఈ 13 అసెంబ్లీ స్థానాల్లో తమ విజయంపై అటు ఎన్డీయే ఇటు ఇండియా కూటమి ఎంతగానో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.
Read Also: Nigeria : కూలిన రెండంతస్తుల పాఠశాల భవనం.. 22 మంది విద్యార్థులు మృతి, 132 మందికి గాయాలు
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
కాగా, పశ్చిమ బెంగాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలు మణిక్తలా, రణఘాట్ సౌత్, బాగ్దా, రాయ్గంజ్ లకు సంబంధించిన ఉప ఎన్నికల ఫలితాలు నేటి మధ్యాహ్నం వరకు వెలువడనున్నాయి. 2021లో మణిక్తలా మినహా మిగిలిన మూడు స్థానాల్లో బీజేపీ గెలిచింది. అలాగే, మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా అమర్వాడ అసెంబ్లీ స్థానానికి జరిగిన బై పోల్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ 78. 71 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, ఉత్తరాఖండ్లోని మంగళూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో 68.24 శాతం, బద్రీనాథ్లో 51.43 శాతం ఓటింగ్ నమోదైంది.. ఈ స్థానాలకు సైతం ఓట్ల లెక్కింపు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. దీంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీహార్లోని రూపాలి అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో 57 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజక వర్గాలకు బై ఎలక్షన్స్ జరిగాయి. ఈ బైల్ పోల్ ఓట్లు లెక్కింపు ఈరోజు 8 గంటల నుంచి కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!