Dallewal Health Update: మరింత క్షీణించిన రైతు నాయకుడు దల్లేవాల్ ఆరోగ్యం..
- రోజురోజుకు మరింత క్షీణిస్తున్న రైతు నాయకుడు దల్లేవాల్ ఆరోగ్యం..
- ప్రస్తుతం దల్లేవాల్ మూత్ర పిండాలు క్రమేపీ పని చేయలేని స్థితికి వచ్చాయి..
- దల్లేవాల్ దీక్ష విరమించినా కీలక అవయవాలు పూర్తిస్థాయిలో పని చేస్తాయన్న గ్యారెంటీ: డాక్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dallewal Health Update: పంజాబ్- హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష (70) ఈరోజు (జనవరి 6) 42వ రోజుకు చేరుకుంది. దల్లేవాల్ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆందోళన చెందుతుంది. కాగా, శనివారం నాడు స్ట్రెచర్ పైనుంచే మహా పంచాయత్ను ఉద్దేశించి ఆయన 11 నిమిషాల పాటు ప్రసంగించారు. తిరిగి దీక్షా శిబిరంలోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. కాగా, ఆదివారం నాటికి దల్లేవాల్ మగతలో ఉన్నారని, వాంతులు చేసుకుంటున్నారని డాక్టర్ అవతార్ సింగ్ తెలిపారు.
Read Also: Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించనున్న ప్రధాని
Also Read
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ఇక, రైతు నాయకుడు దల్లేవాల్ యొక్క మూత్ర పిండాలు కూడా క్రమేపీ పని చేయలేని స్థితికి వచ్చాయని గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ను బట్టి తెలుస్తోందని డాక్టర్ అవతార్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని ఎస్కేఎం నేతలు చెప్పుకొచ్చారు. తక్షణమే ఆయన దీక్షను విరమించినా కీలక అవయవాలు పూర్తి స్థాయిలో పని చేస్తాయన్న గ్యారెంటీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉండటంతో బరువును కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య సాయం అందించేందుకు పంజాబ్ సర్కార్ ముందుకు వచ్చిన దల్లేవాల్ తిరస్కరించారు.
Read Also: Sania Mirza: కొత్త ప్రయాణం ప్రారంభించిన సానియా మీర్జా!
అయితే, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై ధిక్కారం కింద తగిన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ ఈరోజు (జనవరి 6) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆదివారం జగ్జీత్ సింగ్ దల్లేవాల్ను పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ నానక్ సింగ్, మాజీ డిప్యూటీ డీఐజీ నరీందర్ భార్గవ్ మాట్లాడారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లాంటి డిమాండ్లతో నవంబర్ 26వ తేదీ నుంచి దల్లేవాల్ ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!