Dallewal Health Update: మరింత క్షీణించిన రైతు నాయకుడు దల్లేవాల్ ఆరోగ్యం..
- రోజురోజుకు మరింత క్షీణిస్తున్న రైతు నాయకుడు దల్లేవాల్ ఆరోగ్యం..
- ప్రస్తుతం దల్లేవాల్ మూత్ర పిండాలు క్రమేపీ పని చేయలేని స్థితికి వచ్చాయి..
- దల్లేవాల్ దీక్ష విరమించినా కీలక అవయవాలు పూర్తిస్థాయిలో పని చేస్తాయన్న గ్యారెంటీ: డాక్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dallewal Health Update: పంజాబ్- హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష (70) ఈరోజు (జనవరి 6) 42వ రోజుకు చేరుకుంది. దల్లేవాల్ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆందోళన చెందుతుంది. కాగా, శనివారం నాడు స్ట్రెచర్ పైనుంచే మహా పంచాయత్ను ఉద్దేశించి ఆయన 11 నిమిషాల పాటు ప్రసంగించారు. తిరిగి దీక్షా శిబిరంలోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. కాగా, ఆదివారం నాటికి దల్లేవాల్ మగతలో ఉన్నారని, వాంతులు చేసుకుంటున్నారని డాక్టర్ అవతార్ సింగ్ తెలిపారు.
Read Also: Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించనున్న ప్రధాని
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
ఇక, రైతు నాయకుడు దల్లేవాల్ యొక్క మూత్ర పిండాలు కూడా క్రమేపీ పని చేయలేని స్థితికి వచ్చాయని గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ను బట్టి తెలుస్తోందని డాక్టర్ అవతార్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని ఎస్కేఎం నేతలు చెప్పుకొచ్చారు. తక్షణమే ఆయన దీక్షను విరమించినా కీలక అవయవాలు పూర్తి స్థాయిలో పని చేస్తాయన్న గ్యారెంటీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉండటంతో బరువును కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య సాయం అందించేందుకు పంజాబ్ సర్కార్ ముందుకు వచ్చిన దల్లేవాల్ తిరస్కరించారు.
Read Also: Sania Mirza: కొత్త ప్రయాణం ప్రారంభించిన సానియా మీర్జా!
అయితే, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై ధిక్కారం కింద తగిన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ ఈరోజు (జనవరి 6) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆదివారం జగ్జీత్ సింగ్ దల్లేవాల్ను పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ నానక్ సింగ్, మాజీ డిప్యూటీ డీఐజీ నరీందర్ భార్గవ్ మాట్లాడారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లాంటి డిమాండ్లతో నవంబర్ 26వ తేదీ నుంచి దల్లేవాల్ ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!