Kejriwal: కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర.. కేంద్రం, పోలీసులపై ఆప్ తీవ్ర ఆరోపణలు
- కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర
- కేంద్రం, పోలీసులపై ఆప్ తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ను చంపేందుకు కేంద్రం, ఢిల్లీ పోలీసులు కుట్రపన్నారని ఆప్ ముఖ్యమంత్రులు అతిషి, భగవంత్ మాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రులిద్దరూ మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు… అరవింద్ కేజ్రీవాల్ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పంజాబ్ పోలీసులు కేజ్రీవాల్కు అందించిన భద్రతను ఉపసంహరించుకున్న తర్వాత ఈ ఆరోపణలు వెళ్లువెత్తాయి.
ఇది కూడా చదవండి: Supreme Court : నోయిడాలో అక్రమ పరిహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం
Also Read
- MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్పై జరిగిన దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది. తమ నాయకుడికి భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్కు పంజాబ్ పోలీసుల భద్రత కల్పిస్తున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు, భారత ఎన్నికల సంఘం జోక్యంతో పంజాబ్ పోలీసులు భద్రతను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ తీవ్ర ఆరోపణలు చేసింది. అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఢిల్లీ పోలీసులు.. దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నా కళ్లు మూసుకున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్కు భద్రత కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ లేఖ రాసిందని అతిషి తెలిపారు. అయినా అమిత్ షా ఆధీనంలో ఉన్న ఢిల్లీ పోలీసులపై తమకు నమ్మకం లేదని అతిషి అన్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court : నోయిడాలో అక్రమ పరిహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ ర్యాలీలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఇలా పలుమార్లు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు భద్రత పెంచాలని ఈసీకి ఆప్ లేఖలు రాసింది. ఇంతలోనే పంజాబ్ పోలీసులు.. కేజ్రీవాల్కు భద్రత కల్పించారు. అయితే ఈసీ ఆదేశాలతో భద్రతను ఉపసంహరించుకున్నట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ బీజేపీ, ఆప్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక ప్రస్తుత ప్రభుత్వ కాలం ఫిబ్రవరి 23తో ముగుస్తుంది.
केजरीवाल जी को ख़त्म करना चाहती है BJP‼️
“क्या देश में आजतक कभी ऐसा हुआ है कि जिसे Z+ सुरक्षा मिली हो और उसके ऊपर बार-बार हमला किया गया हो और पुलिस सामने तक ना आए, हमलावरों को पकड़ा तक ना जाए?
BJP और अमित शाह किसी भी तरह से अरविंद केजरीवाल जी को ख़त्म करना चाहते हैं।”… pic.twitter.com/4B0hrHbaY4
— AAP (@AamAadmiParty) January 24, 2025
अरविंद केजरीवाल जी को जान से मारने की रची जा रही साज़िश‼️
♦️ इस साजिश में एक खिलाड़ी बीजेपी के कार्यकर्ता हैं, जो अरविंद केजरीवाल जी के ऊपर हमला करते हैं
♦️ वहीं दूसरी खिलाड़ी BJP और अमित शाह के अंतर्गत आने वाली दिल्ली पुलिस है @AtishiAAP pic.twitter.com/uxwCnS5Mra
— AAP (@AamAadmiParty) January 24, 2025
తాజావార్తలు
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?