Vice-President: తదుపరి ఉపరాష్ట్రపతిగా పేర్లు పరిశీలన..! ఆ పార్టీ నేతకు ఛాన్స్!
- తదుపరి ఉపరాష్ట్రపతిగా పేర్లు పరిశీలన..!
- సంకీర్ణ పార్టీ నేతకు అవకాశం దక్కే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగదీప్ ధన్ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవి ఉండగానే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో వైదొలగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ధన్ఖర్ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే రాజీనామా చేయడం విమర్శలకు తావిస్తోంది. మోడీ ప్రభుత్వానికి మేలు చేసేందుకే ధన్ఖర్ రాజీనామా చేశారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Mamata Banerjee: "నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు".. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ
అయితే తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరంటూ తీవ్ర చర్చ నడుస్తోంది. ధన్ఖర్ వారసుడి కోసం వేట మొదలైంది. ఈ పోటీలో సీనియర్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, అనుభవజ్ఞులైన పార్టీ నాయకులు ఉన్నారు. అయితే త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర నేతకే ఛాన్స్ దక్కే అవకాశం ఉందని బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం జేడీయూ నేతృత్వంలో బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు హరివంశ్ను ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చోబెడితే ప్రయోజనం చేకూరుతుందని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హరివంశ్ ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. కనుక ఉపరాష్ట్రపతి స్థానంలో ఆయన్నే కూర్చోబెడితే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసొస్తుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: CBSE: సీబీఎస్ఈ పాఠశాలల్లో కొత్త నిబంధనలు.. ఆదేశాలు జారీ
ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు నితీష్ కుమార్ కూడా ఎన్నికల హామీలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి పదవిని బీహార్ నేతకు అప్పగించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం