Pawan Khera Arrest: కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాని విమానం నుంచి దించి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Khera Arrest: కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాని విమానం నుంచి దింపేసిన తర్వాత అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు వెళ్లేందుకు బయలుదేరిన పవన్ ఖేరాను విమానం నుంచి దింపేశారు అధికారులు. పార్టీ నేతలతో కలిసి విమానం ఎక్కిన కొద్ది సేపటికే ఆయనను అధికారులు అడ్డగించారు. రాయ్ పూర్ లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి ఆయన వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Read Also: Supreme Court : అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ వాయిదా
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
అరెస్ట్ వారెంట్ లేకుండానే పవన్ ఖేరాను ఆపారని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ కావాలనే కాంగ్రెస్ నేతలపై బలప్రయోగం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. పవన్ ఖేరాను ఢిల్లీ-రాయ్పూర్ ఫ్లైట్ నుండి దింపి, ఏఐసిసి ప్లీనరీకి రాకుండా చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం గూండాల వ్యవహరిస్తోందని, అతడిని అడ్డుకోవడం సిగ్గు చేటని, పార్టీ మొత్తం పవన్ ఖేరాకు అండగా నిలుస్తుందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. ముందుగా ఈడీని చత్తీస్ గఢ్ పంపారని, ఇప్పుడు కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న పవన్ ఖేరాను ఫ్లైట్ ఎక్కకుండా ఆపారని.. ఈ నియంతృత్వాన్ని అస్సలు సహించమని.. పోరాడి గెలుస్తామని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
అస్సాం పోలీసుల విజ్ఞప్తి మేరకు పవన్ ఖేరాను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారనే ఆరోపణలపై ఖేరాను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవల విలేకరులు సమావేశంలో అదానీ హిండెన్ బర్గ్ వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరపాలని పవన్ ఖేరా డిమాండ్ చేశారు. పీవీ నరసింహరావు, అటల్ బిహారీ వాజ్ పేయిలు జేపీసీని ఏర్పాటు చేయగలిగితే.. ప్రధాని ‘‘నరేంద్ర గౌతమ్ దాస్’’.. సారీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి ఏ సమస్య వచ్చిందని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!