G20 Dinner: ఖర్గేని విందుకు పిలువకపోవడంపై రాజకీయం.. కుల వివక్ష అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Dinner: భారత్ ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తోంది. దాదాపుగా 30కి పైగా దేశాధినేతలు ఈ సమాశాలకు హాజరవుతున్నారు. వివిధ దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులను, వ్యాపార దిగ్గజాలను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఈ విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, క్యాబినెట్ హోదా ఉన్న మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు.
Read Also: Chandramukhi 2 : గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ డైరెక్టర్..?
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కాగా ఇప్పుడు ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తిచూపుతోంది. కులవివక్ష అని విమర్శలు గుప్పిస్తోంది. దళిత నేత అయిన ఖర్గేను జీ20 విందు అతిథి జాబితా నుంచి తప్పించడంతో మోడీ ప్రభుత్వం కులవివక్ష చూపించిందని తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత మోహన్ కుమారమంగళం ఆరోపించారు. మనుస్మృతి రచించిన మహర్షి మనువు వారసత్వాన్ని ప్రధాని మోడీ సమర్థిస్తున్నారంటూ, కుల వివక్ష చూపిస్తున్నాంటూ ఆయన ఆరోపిస్తున్నారు.
అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి ‘భూమి పూజ’ చేసే సమయంలో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను ఆహ్వానించలేదని, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని ఆయన అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రతిపక్షాలకు విలువ ఇవ్వరని, అందుకే తమను జీ20 సమావేశానికి పిలవలేదని, దేశ జనాభాలో 60 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వానికి విలువ ఇవ్వరని అన్నారు. అయితే ఈ విందుకు ఏ రాజకీయ పార్టీలను పిలువలేదు.
తాజావార్తలు
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?