Delhi: అమిత్ షా వ్యాఖ్యలపై 24న దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
- అమిత్ షా వ్యాఖ్యలపై ఆందోళనలు ఉధృతం
- 24న దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభలో అంబేద్కర్పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అమిత్ షాను బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా మరొకసారి దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది. డిసెంబర్ 24న దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ ‘‘బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్’’ నిర్వహించాలని పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ సర్క్యులర్ జారీ చేశారు. ఇక సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు డిసెంబర్ 22, 23 తేదీల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
డిసెంబర్ 24న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మార్చ్ ప్రారంభించాలని, జిల్లా మెజిస్ట్రేట్లకు మెమొరాండం సమర్పించేంత వరకూ మార్చ్ కొనసాగించాలని కేసీ.వేణుగోపాల్ సూచించారు. ప్రెస్ కాన్ఫరెన్స్లలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొంటారన్నారు.
Also Read
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
డిసెంబర్ 18న రాజ్యసభలో అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ పేరును పదేపదే ప్రస్తావించడం కాంగ్రెస్కు ఒక ఫ్యాషన్గా మారిందని విమర్శించారు. దేవుడి పేరు పదే పదే తలుచుకుంటే కనీసం స్వర్గమైనా దొరుకుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అంబేద్కర్ను అమమానించినందుకు అమిత్షా క్షమాపణ చెప్పాలని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు వెలుపల నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్లు గాయపడ్డారు. పార్లమెంటుకు వెళ్తుండగా తనను కూడా గెంటినట్టు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆరోపించారు. ఇరువర్గాల వారు పార్లమెంటు పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు చేశారు.
పార్లమెంట్ దాడి ఘటనపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని.. వాళ్ల నటనకు అవార్డులు ఇవ్వాల్సిందేనని జయా బచ్చన్ ఎద్దేవా చేశారు. రాజ్యసభలో అంబేద్కర్పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి డైవర్ట్ చేసేందుకే బీజేపీ ఎంపీలు దాడి అంటూ డ్రామాలాడారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!