Congress: మోడీ వేరు, వాజ్పేయి వేరు.. కాంగ్రెస్ పోలిక..
- వాజ్పేయి, ప్రధాని మోడీకి మధ్య కాంగ్రెస్ పోలిక..
- ప్రధానులు వేరు, బీజేపీ పార్టీ వేరు అంటూ జైరాం రమేష్ వ్యాఖ్యలు..
Congress: కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్, ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్పేయి సమయంలో కార్గిల్ యుద్ధ సమయంలో ఉన్న బీజేపీకి, ఇప్పటి బీజేపీ చాలా మార్పు ఉందని అన్నారు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత నలుగురు సభ్యులతో కార్గిల్ సమీక్ష కమిటిని ఏర్పాటు చేయాలనే వాజ్పేయి నిర్ణయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న వాజ్పేయికి, ఇప్పుడు ఉన్న ప్రధాని మోడీ వేరు వేరు అని అన్నారు.
‘‘భారత-పాకిస్తాన్ యుద్ధం ముగిసిన మూడు రోజుల తర్వాత, జూలై 30, 1999న, వాజ్పేయి ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కార్గిల్ సమీక్ష కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కె. సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు, ఆయన కుమారుడు ఇప్పుడు భారతదేశ విదేశాంగ మంత్రి. కమిటీ డిసెంబర్ 15, 1999న నివేదికను సమర్పించింది. ఫిబ్రవరి 23, 2000న తగిన సవరణలతో పార్లమెంటులో దీనిని ప్రవేశపెట్టారు. దీనిపై కూడా చర్చించారు. కానీ అప్పటి ప్రధాని, పాలక బీజేపీ వేరు’’ అని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
Also Read
Read Also: Hamas: టర్కీకి పారిపోయి మళ్లీ వివాహం చేసుకున్న “హమాస్” చీఫ్ భార్య..
లోక్సభలో సోమవారం జరగనున్న ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ ముందు జైరాం రమేష్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని ఇంకా చట్టం ముందు నిలబెట్టలేదని ఆయన అన్నారు. గతంలో ఈ ఉగ్రవాదులే పూంచ్ (డిసెంబర్ 2023), గంగాగిర్ మరియు గుల్మార్గ్ (అక్టోబర్ 2024)లలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష సమావేశానికి మోడీ అధ్యక్షత వహించకపోవడంపై విమర్శలు గుప్పించారు.
భారతదేశం- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనపై జైరాం రమేష్ మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను ట్రంప్ విందుకు ఎలా ఆతిథ్యం ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ట్రంప్ 26 సార్లు యుద్ధాన్ని ఆపినట్లు ప్రకటించుకున్నాడని, 5 ఫైటర్ జెట్లు కూలినట్లు చెప్పాడని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో