Mallikarjun Kharge: ఎన్నికల విధానంపై ప్రజలకు నమ్మకం పోతుంది
- ఎన్నికల విధానంపై ప్రజలకు నమ్మకం పోతుంది
- బెళగావిలో సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల విధానం, ప్రక్రియ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం నెమ్మదిగా సన్నగిల్లుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కర్ణాటకలోని బెళగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. గాంధీ-నెహ్రూ వారసత్వం ఉన్న తాము ప్రత్యర్థుల అబద్దాలను తుత్తునియలుగా చేస్తామన్నారు. ఎన్నికల సంఘం తీరుపై పలు అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. దేశానికి అవసరమైన కీలక సంస్థలను తన అధీనంలో.. కనుసన్నల్లో మెలిగేలా అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “కేంద్ర ఎన్నికల సంఘం” లాంటి రాజ్యాంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తోందని వ్యాఖ్యానించారు. దీన్ని అడ్డుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. మారిన ఎన్నికల నియమ, నిబంధనలను వెల్లడించాలని కోర్టు ఆదేశించినా.. ఎందుకు దాచి పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బెళగావి సమావేశాల తర్వాత సరికొత్త ఉత్సాహంతో కార్యకర్తలు అకుంఠిత దీక్షతో పని చేయాలని.. ప్రత్యర్థుల అబద్దాలను, కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
గురు, శుక్రవారాల్లో కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ భైఠక్గా నామకరణం చేశారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు. మొత్తంగా 200 మంది కీలక నేతలు ఈ మీటింగ్లో పాల్గొంటారని ఏఐసీసీ వెల్లడించింది. అయితే ఈ సమావేశానికి సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ హాజరుకాలేదు. సోనియాకు అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
మహాత్మాగాంధీ నగర్లో గురువారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. డిసెంబర్ 27 ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ రెండు తీర్మానాలు ఆమోదించనుంది. వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై కూడా కీలక చర్చ జరపనున్నారు. ఇక ఈ భేటీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా గురించి కూడా చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!