Wayanad landslides: వయనాడ్ ప్రకటన.. అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్..
- అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్..
- వయనాడ్ ఘటనపై తప్పుడు ప్రకటన చేశారన్న జైరాం రమేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad landslides: కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శుక్రవారం సభాహక్కుల ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాయనాడ్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు ఇచ్చామని అమిత్ షా చేసిన వాదనపై కాంగ్రెస్ అభ్యతరం వ్యక్తిచేసింది. కేరళ ఈ హెచ్చరికలపై చర్యలు తీసుకోలేదని షా అన్నారు. అయితే, ఈ వాదనల్ని ప్రివిలేజ్ నోటీసుల్లో జైరాం రమేష్ తోసిపుచ్చారు.
Read Also: UPI Payment: యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. ఆ రోజున చెల్లింపులు జరగవు.. కేవలం వారికే!
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందనే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన రాజ్యసభను తప్పుదోవ పట్టించిందని స్పష్టమైంది, అవి అబద్ధమని నిరూపించబడ్డాయని నోటీసులో పేర్కొన్నారు. సభ్యుడు లేదా మంత్రి సభను తప్పుదారి పట్టించడం ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, ఇది సభను ధిక్కరించడమే అని ప్రివిలేజ్ నోటీసుల్లో పేర్కొంది.
జూలై 31 బుధవారం రాజ్యసభలో అమిత్ షా ప్రసంగిస్తూ జూలై 23న కేరళ ప్రభుత్వానికి కొండచరియలు విరిగిపడతాయనే ముందస్తు హెచ్చరిక జారీ చేసినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. జూలై 23న, ఘటన జరగడానికి ఏడు రోజుల ముందు కేరళ ప్రభుత్వానికి కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేసిందని, ఆ తర్వాత జూలై 24, 25 తేదీల్లో మరోసారి హెచ్చరించామని, జూలై 26న వార్నింగ్ ఇచ్చామని చెప్పారు. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళని హెచ్చరించినట్లు అమిత్ షా చెప్పారు. వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికి పైగా ప్రజలు మరణించారు.
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!