Wayanad landslides: వయనాడ్ ప్రకటన.. అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్..
- అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్..
- వయనాడ్ ఘటనపై తప్పుడు ప్రకటన చేశారన్న జైరాం రమేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad landslides: కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శుక్రవారం సభాహక్కుల ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాయనాడ్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు ఇచ్చామని అమిత్ షా చేసిన వాదనపై కాంగ్రెస్ అభ్యతరం వ్యక్తిచేసింది. కేరళ ఈ హెచ్చరికలపై చర్యలు తీసుకోలేదని షా అన్నారు. అయితే, ఈ వాదనల్ని ప్రివిలేజ్ నోటీసుల్లో జైరాం రమేష్ తోసిపుచ్చారు.
Read Also: UPI Payment: యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. ఆ రోజున చెల్లింపులు జరగవు.. కేవలం వారికే!
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందనే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన రాజ్యసభను తప్పుదోవ పట్టించిందని స్పష్టమైంది, అవి అబద్ధమని నిరూపించబడ్డాయని నోటీసులో పేర్కొన్నారు. సభ్యుడు లేదా మంత్రి సభను తప్పుదారి పట్టించడం ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, ఇది సభను ధిక్కరించడమే అని ప్రివిలేజ్ నోటీసుల్లో పేర్కొంది.
జూలై 31 బుధవారం రాజ్యసభలో అమిత్ షా ప్రసంగిస్తూ జూలై 23న కేరళ ప్రభుత్వానికి కొండచరియలు విరిగిపడతాయనే ముందస్తు హెచ్చరిక జారీ చేసినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. జూలై 23న, ఘటన జరగడానికి ఏడు రోజుల ముందు కేరళ ప్రభుత్వానికి కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేసిందని, ఆ తర్వాత జూలై 24, 25 తేదీల్లో మరోసారి హెచ్చరించామని, జూలై 26న వార్నింగ్ ఇచ్చామని చెప్పారు. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళని హెచ్చరించినట్లు అమిత్ షా చెప్పారు. వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికి పైగా ప్రజలు మరణించారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!