Congress: “మాకు ఓటేయకుంటే కరెంట్ కట్ చేస్తాం”.. ఓటర్లను బెదిరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడంతో బీజేపీ కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్ బెదిరింపు వ్యాఖ్యలు అక్కడ వైరల్గా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించకుంటే విద్యుత్ నిలిపేస్తామని బెదిరించాడు.
Read Also: Kishan Reddy : రేవంత్ రెడ్డి పరిస్థితి దిగజారింది.. అపరిపక్వంగా, అహంకారంతో మాట్లాడుతున్నారు
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
చిక్కోడిలోని కగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కేజ్ మాట్లాడుతూ..‘‘ మీరు మాకు ఆధిక్యం ఇవ్వకపోతే మేము కరెంట్ కట్ చేస్తాం. నేను నా మాటలకు కట్టుబడి ఉంటాను’’ అని వ్యాఖ్యానించారు. ఓటర్లను భయపెట్టడంపై బీజేపీ ఫైర్ అవుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఈ ఎమ్మెల్యేకు కొత్త కాదు. ఇటీవల మరో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ మరణించిన సందర్భంలో ఎవరు వారసత్వం తీసుకుంటారు అని ప్రశ్నించడం విమర్శలకు కారణమైంది. గతంలో కూడా పీఎం మోడీ విలాసవంతమైన జీవనశైలి గడుపుతున్నారని, విమానాల్లో తిరుగుతున్నారని, దుస్తులపై దుబారా ఖర్చులు చేస్తున్నారంటూ ఆరోపించారు.
మరోవైపు రాజు కేజ్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ నేత షెహజాదా పూనావాలా అతడిని బెదిరింపుల వ్యక్తిగా అభివర్ణించారు. కాంగ్రెస్ బెదిరించే వ్యూహాలకు పాల్పడుతోందని విమర్శించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓటర్ల సమస్యలను పరిష్కరించాలంటే తన తమ్ముడిని గెలిపించాలని గతంలో కోరారు. బెంగళూర్లోని నీటి సంక్షోభం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!