Congress Minister: ఢిల్లీ పేలుడుతో బీజేపీకి సంబంధం ఉందా.? కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- ఢిల్లీ కారు బ్లాస్ట్పై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- బీజేపీతో సంబంధం ఉందాా.?
- అనుమానం వ్యక్తం చేసిన జమీర్ అహ్మద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Minister: కర్ణాటక మైనారిటీ వ్యవహారాల మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఢిల్లీ కారు బ్లాస్ట్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికలకు ఒక రోజు ముందు పేలుడు జరిగిందని, పేలుడు సమయాన్ని ప్రశ్నించారు. బెంగళూర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పేలుడు ఘటనపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కారు బాంబు జరగాల్సింది కాదు. బాంబు పేలుడు నవంబర్ 10న జరిగింది. నవంబర్ 11న బీహార్ ఎన్నికలు జరిగాయి’’ అని ఆయన అన్నారు. బీహార్ ఎన్నికలకు సరిగ్గా ఒక రోజు ముందే ఈ పేలుడు ఎందుకు జరిగిందని అనుమానించారు. ఢిల్లీ పేలుడు నిందితులకు రాజకీయ సంబంధాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయని జమీర్ అహ్మద్ అన్నారు.
Read Also: Vijayawada Crime: భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త.. రోడ్డుపై కత్తితో వీరంగం సృష్టించిన భర్త..!
Also Read
- MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..
బీజేపీ, ప్రధాని మోడీ అధికారం కోసం ఏ స్థాయికైనా వెళ్లవచ్చని చెబుతున్న నేపథ్యంలో ఈ సందేహం తలెత్తినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇస్లాంలో ఎక్కడా ఉగ్రవాదంలో పాల్గొనాలని చెప్పలేదని, ఉగ్రవాదంలో పాల్గొనే వారు ముస్లింలు కారని ఆయన అన్నారు. బీహార్లో ఎన్నికల ముందు ఒక రోజు ఈ సంఘటన ఎందుకు జరిగిందో దర్యాప్తు ద్వారా మాత్రమే తెలుస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఎన్నికల సమయంలో దేశంలో ఉగ్రవాద దాడులకు కారణం ఏమిటి.? అని ఎక్స్లో ప్రశ్నించారు. ఈ ఘటనపై కేంద్రం పూర్తి దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అయితే, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇవి దిగజారిన రాజకీయాలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని బీజేపీ ఆరోపించింది.
#WATCH | Bengaluru: On Delhi car blast, Karnataka Minister B Z Zameer Ahmed Khan says, "The car blast should not have happened. The bomb blast happened on the 10th, and there were elections in Bihar on the 11th… We have heard that there is a political involvement in this… HM… pic.twitter.com/L1pgqbgDFp
— ANI (@ANI) November 12, 2025
తాజావార్తలు
-
Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
-
Gurindervir Singh: భారత అత్యంత వేగవంతమైన రన్నర్గా గురిందర్వీర్ సింగ్ నయా రికార్డు.. 10.09 సెకన్లలో 100 మీటర్లు పూర్తి
-
Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్ప్రెస్పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
-
MI vs RR: వాంఖడేలో హోరాహోరీ పోరు.. ముంబై vs రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?