Congress Minister: ఢిల్లీ పేలుడుతో బీజేపీకి సంబంధం ఉందా.? కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- ఢిల్లీ కారు బ్లాస్ట్పై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- బీజేపీతో సంబంధం ఉందాా.?
- అనుమానం వ్యక్తం చేసిన జమీర్ అహ్మద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Minister: కర్ణాటక మైనారిటీ వ్యవహారాల మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఢిల్లీ కారు బ్లాస్ట్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికలకు ఒక రోజు ముందు పేలుడు జరిగిందని, పేలుడు సమయాన్ని ప్రశ్నించారు. బెంగళూర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పేలుడు ఘటనపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కారు బాంబు జరగాల్సింది కాదు. బాంబు పేలుడు నవంబర్ 10న జరిగింది. నవంబర్ 11న బీహార్ ఎన్నికలు జరిగాయి’’ అని ఆయన అన్నారు. బీహార్ ఎన్నికలకు సరిగ్గా ఒక రోజు ముందే ఈ పేలుడు ఎందుకు జరిగిందని అనుమానించారు. ఢిల్లీ పేలుడు నిందితులకు రాజకీయ సంబంధాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయని జమీర్ అహ్మద్ అన్నారు.
Read Also: Vijayawada Crime: భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త.. రోడ్డుపై కత్తితో వీరంగం సృష్టించిన భర్త..!
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
బీజేపీ, ప్రధాని మోడీ అధికారం కోసం ఏ స్థాయికైనా వెళ్లవచ్చని చెబుతున్న నేపథ్యంలో ఈ సందేహం తలెత్తినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇస్లాంలో ఎక్కడా ఉగ్రవాదంలో పాల్గొనాలని చెప్పలేదని, ఉగ్రవాదంలో పాల్గొనే వారు ముస్లింలు కారని ఆయన అన్నారు. బీహార్లో ఎన్నికల ముందు ఒక రోజు ఈ సంఘటన ఎందుకు జరిగిందో దర్యాప్తు ద్వారా మాత్రమే తెలుస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఎన్నికల సమయంలో దేశంలో ఉగ్రవాద దాడులకు కారణం ఏమిటి.? అని ఎక్స్లో ప్రశ్నించారు. ఈ ఘటనపై కేంద్రం పూర్తి దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అయితే, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇవి దిగజారిన రాజకీయాలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని బీజేపీ ఆరోపించింది.
#WATCH | Bengaluru: On Delhi car blast, Karnataka Minister B Z Zameer Ahmed Khan says, "The car blast should not have happened. The bomb blast happened on the 10th, and there were elections in Bihar on the 11th… We have heard that there is a political involvement in this… HM… pic.twitter.com/L1pgqbgDFp
— ANI (@ANI) November 12, 2025
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!