Congress: “మెహంగాయ్ పర్ హల్లా బోల్” నినాదంతో నేడు కాంగ్రెస్ భారీ ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress-Mehangai Par Halla Bol rally: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరుబాటు పట్టింది. నిత్యవసరాల ధరల పెరుగుదలపై “మెహంగాయ్ పర్ హల్లా బోల్” నినాదంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీ రాంలీలా మైదాన్ లో భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, పిసిసి అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు, పిసిసి మాజీ అధ్యక్షులు, ఎమ్.పిలు, పార్టీ అగ్రనేతలు ఉదయం 11 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి బస్సులలో బయల్దేరి “రాంలీలా మైదాన్” కు చేరుకోనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు రాంలీలా మైదాన్ లోని సభాస్థలికి రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కాంగ్రెస్ కార్యకర్తలు, పీసీసీ సభ్యులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. దీంతో పాటు ఆగస్టు 17 నుంచి 23 వరకు వరుసగా దేశంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ “మెహంగాయ్ చౌపాల్” నిరసన ప్రదర్శనలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. దీనికి ముగింపుగా నేడు ఢిల్లీలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది కాంగ్రెస్.
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Read Also: Nasa: నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా.. కారణం ఇదే..!!
దేశంలో నిత్యవాసరాల ధరలు అంతకంతకు పెరుగుతున్న తరుణంలో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ, నిరసనలు చేపడుతోంది. ఢిల్లీలో జరుగుతున్న భారీ ర్యాలీకి హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకానున్నారు. బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా పెరుగుతన్న ధరలపై ప్రజాపోరాటాలు చేస్తామని.. కాంగ్రెస్ ప్రకటించింది. మోదీ ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలే సామాన్య ప్రజల కష్టాలకు కారణం అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించింది. సామాన్యుడు పడుతున్న బాధల పట్ల ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని బీజేపీని విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 7 నుంచి కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో’’ యాత్రను చేపడుతున్నారు. 3500 కిలోమీటర్ల పొడవున దేశం మొత్తం యాత్ర జరగనుంది. పెరిగిన ధరలు, నిరుద్యోగం, మత సామరస్యం లాంటి పలు సమస్యల గురించి ప్రజలకు వివరిస్తూ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నారు రాహుల్ గాంధీ.
తాజావార్తలు
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
-
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!