Ghulam Nabi Azad: కాంగ్రెస్ నాపై క్షిపణులు ప్రయోగించింది.. నేను రైఫిల్తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghulam Nabi Azad: కాంగ్రెస్తో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని ఇటీవలే ముగించుకున్న మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, తన మాజీ పార్టీకి చెందిన నాయకులు తనపై క్షిపణులు ప్రయోగించినప్పుడు మాత్రమే తాను రైఫిల్తో ప్రతీకారం తీర్చుకున్నానని అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని భదర్వాలో గురువారం జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ఆజాద్ మాట్లాడుతూ.. “వారు (కాంగ్రెస్) నాపై క్షిపణులను ప్రయోగించారు, నేను 303 రైఫిల్తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను. వాటిని ధ్వంస చేశాను. నేను బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగిస్తే ఏమి జరిగేది?.” అని గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే, ఆయన దివంగత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. 52 ఏళ్లుగా పార్టీలో సభ్యుడిగా ఉండి, రాజీవ్గాంధీని సోదరుడిగా, ఇందిరాగాంధీని నా తల్లిగా భావిస్తున్నందున, వారిపై పదజాలం కూడా ఉపయోగించాలనే కోరిక నాకు లేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ను విడిచిపెట్టిన తర్వాత జమ్మూలో జరిగిన తన మొదటి బహిరంగ సభలో తన సొంత రాజకీయ సంస్థను ప్రారంభించనున్నట్లు ఆజాద్ ప్రకటించారు. “నేను ఇంకా నా పార్టీకి పేరు నిర్ణయించలేదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు పార్టీకి పేరు మరియు జెండాను నిర్ణయిస్తారు. నేను నా పార్టీకి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా హిందూస్థానీ పేరు పెడతాను” అని ఆయన అన్నారు. గులాం నబీ ఆజాద్ 2005-2008 కాలంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆగస్టు 26న, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. గత తొమ్మిదేళ్లలో పార్టీని నడిపిన తీరుపై ఆయన పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
CUET UG Results 2022: సెప్టెంబర్ 15 నాటికి కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు
ఆ పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ అపరిపక్వత కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినట్లు ఆజాద్ ఆరోపించారు. పార్టీలో సంప్రదింపు వ్యవస్థను రాహులే ధ్వంసం చేసినట్లు విమర్శలు గుప్పించారు. దురదృష్టవశాత్తు రాహుల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న పాత విధానాలు దెబ్బతిన్నట్లు ఆజాద్ ఆరోపించారు. 2013లో రాహుల్ను పార్టీ ఉపాధ్యక్షుడిగా సోనియా నియమించారని, కానీ సంప్రదింపుల వ్యవస్థను రాహుల్ నాశనం చేసినట్లు ఆరోపించారు. రాహుల్లో పరిపక్వత లేదనడానికి మరో సంఘటనను ఉదాహరణగా గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఓ సారి ప్రభుత్వ ఆర్డినెన్స్ను రాహుల్ గాంధీ మీడియా ముందే బహిరంగంగా చింపివేసినట్లు వెల్లడించారు. సోనియా గాంధీ పార్టీ అధినేతగా ఉన్నా.. అన్ని కీలక నిర్ణయాలు మాత్రం రాహుల్ గాంధీ లేదా సెక్యూరిటీ గార్డులు, లేదా పీఏలు తీసుకుంటున్నట్లు విమర్శించారు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!