Ghulam Nabi Azad: కాంగ్రెస్ నాపై క్షిపణులు ప్రయోగించింది.. నేను రైఫిల్తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghulam Nabi Azad: కాంగ్రెస్తో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని ఇటీవలే ముగించుకున్న మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, తన మాజీ పార్టీకి చెందిన నాయకులు తనపై క్షిపణులు ప్రయోగించినప్పుడు మాత్రమే తాను రైఫిల్తో ప్రతీకారం తీర్చుకున్నానని అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని భదర్వాలో గురువారం జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ఆజాద్ మాట్లాడుతూ.. “వారు (కాంగ్రెస్) నాపై క్షిపణులను ప్రయోగించారు, నేను 303 రైఫిల్తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను. వాటిని ధ్వంస చేశాను. నేను బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగిస్తే ఏమి జరిగేది?.” అని గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే, ఆయన దివంగత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. 52 ఏళ్లుగా పార్టీలో సభ్యుడిగా ఉండి, రాజీవ్గాంధీని సోదరుడిగా, ఇందిరాగాంధీని నా తల్లిగా భావిస్తున్నందున, వారిపై పదజాలం కూడా ఉపయోగించాలనే కోరిక నాకు లేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ను విడిచిపెట్టిన తర్వాత జమ్మూలో జరిగిన తన మొదటి బహిరంగ సభలో తన సొంత రాజకీయ సంస్థను ప్రారంభించనున్నట్లు ఆజాద్ ప్రకటించారు. “నేను ఇంకా నా పార్టీకి పేరు నిర్ణయించలేదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు పార్టీకి పేరు మరియు జెండాను నిర్ణయిస్తారు. నేను నా పార్టీకి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా హిందూస్థానీ పేరు పెడతాను” అని ఆయన అన్నారు. గులాం నబీ ఆజాద్ 2005-2008 కాలంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆగస్టు 26న, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. గత తొమ్మిదేళ్లలో పార్టీని నడిపిన తీరుపై ఆయన పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని లేఖలో పేర్కొన్నారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
CUET UG Results 2022: సెప్టెంబర్ 15 నాటికి కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు
ఆ పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ అపరిపక్వత కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినట్లు ఆజాద్ ఆరోపించారు. పార్టీలో సంప్రదింపు వ్యవస్థను రాహులే ధ్వంసం చేసినట్లు విమర్శలు గుప్పించారు. దురదృష్టవశాత్తు రాహుల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న పాత విధానాలు దెబ్బతిన్నట్లు ఆజాద్ ఆరోపించారు. 2013లో రాహుల్ను పార్టీ ఉపాధ్యక్షుడిగా సోనియా నియమించారని, కానీ సంప్రదింపుల వ్యవస్థను రాహుల్ నాశనం చేసినట్లు ఆరోపించారు. రాహుల్లో పరిపక్వత లేదనడానికి మరో సంఘటనను ఉదాహరణగా గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఓ సారి ప్రభుత్వ ఆర్డినెన్స్ను రాహుల్ గాంధీ మీడియా ముందే బహిరంగంగా చింపివేసినట్లు వెల్లడించారు. సోనియా గాంధీ పార్టీ అధినేతగా ఉన్నా.. అన్ని కీలక నిర్ణయాలు మాత్రం రాహుల్ గాంధీ లేదా సెక్యూరిటీ గార్డులు, లేదా పీఏలు తీసుకుంటున్నట్లు విమర్శించారు.
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..