Supreme Court: ఎన్నికల నిబంధనల్లో మార్పులపై సుప్రీంలో కాంగ్రెస్ సవాల్
- ఎన్నికల నిబంధనల్లో మార్పులపై కాంగ్రెస్ అభ్యంతరం
- ఈసీ తీరుపై సుప్రీం కోర్టులో కాంగ్రెస్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుత చర్యల కారణంగా ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలుగుతుందని పిటిషన్లో పేర్కొంది. ఎన్నికల సంఘం ఇటీవల చేసిన సవరణలను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఎన్నికలకు సంబంధించిన రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలింగ్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను, వెబ్ కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఏకపక్షంగా ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పులు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు.
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
ఇది కూడా చదవండి: YS Jagan: ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా.. కడప కార్పొరేటర్లతో వైఎస్ జగన్ భేటీ
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను ఏకపక్షంగా తొలగించడం లేదా చేర్చడం వంటి చర్యలకు పాల్పడలేదని కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్కు తెలిపింది. ఓటర్ల జాబితా తయారీలో పాదర్శకత, నిబంధనలు పాటించినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో ఓటర్ల తొలగింపులో అవతవకలు జరగలేదన్న ఈసీ.. కాంగ్రెస్ ప్రతినిధుల భాగస్వామ్యంతో పాటు తగిన ప్రక్రియను అనుసరించామని వెల్లడించింది.
హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత.. ఎన్నికల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా ఫిర్యాదు చేసింది. అయితే కాంగ్రెస్ బృందాన్ని పంపిస్తే.. అనుమానాలు నివృత్తి చేస్తామని ఈసీ తెలిపింది.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు మధ్యప్రదేశ్లో మోడీ పర్యటన.. కెన్-బెత్వా నదుల లింక్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన
తాజావార్తలు
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..