Bharat Jodo Yatra 2.0: రెండో విడత భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ సిద్ధం.. అప్పటి నుంచేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra 2.0: నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఊపు తీసుకువచ్చింది. మొదటిదశ సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమైంది. దాదాపు 4,080 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ, యాత్ర జనవరి 2023లో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ముగిసింది. మొత్తం 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా 126 రోజుల పాటు సాగింది. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చింది. రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా యువత, ఉద్యోగులు, రైతులతో మమేకమయ్యారు. పలు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు జోడో యాత్రలో రాహుల్ వెంట నడిచారు.
Read Also: Nama Nageswara Rao : రైతుల ఆత్మహత్యలు పెరిగిందే కాంగ్రెస్ పాలనలో
Also Read
ఇదిలా ఉంటే మొదటి విడత యాత్ర ద్వారా వచ్చిన ప్రజాస్పందనను మరోసార రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో లోకసభ ఎన్నికల ముందు ఈ యాత్ర ఉండేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా రెండో విడత జోడో యాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
భారత్ జోడో యాత్ర 2.0 పాదయాత్ర డిసెంబర్ 2023- ఫిబ్రవరి 2024 మధ్య ఉండే అవకాశం ఉంది. పాదయాత్రతో పాటు వాహనాల ద్వారా యాత్రను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మొదటి యాత్ర దేశంలోని దక్షిణం నుంచి తూర్పు వైపు సాగితే, ఈసారి తూర్పు నుంచి పడమర వైపు భారత్ జోడో యాత్ర ఉండే అవకాశం ఉంది. గతేడాది యాత్రలో రాహుల్ గాంధీ దేశంలోని నిరుద్యోగం, ద్రవ్యోల్భణం మీద కేంద్రంలోని బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ యాత్ర తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలో కాంగ్రెస్ వేవ్ ఏర్పడేలా యాత్రను ప్లాన్ చేస్తోంది గ్రాండ్ ఓల్డ్ పార్టీ.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!