Mallikarjun Kharge: బీజేపీ టెర్రరిస్టుల పార్టీ.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- బీజేపీ ఉగ్రవాదులు పార్టీ..
- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్..
- ఇటీవల కాంగ్రెస్ అర్బన్ నక్సల్స్ పార్టీ అంటూ ప్రధాని ఫైర్..
- దీనికి ప్రతిగా ఖర్గే వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల కాంగ్రెస్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఇటీవల ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ‘‘అర్బన్ నక్సల్స్’’ పార్టీ అని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఖర్గే స్పందిస్తూ.. బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తోసిపుచ్చారు. ‘‘మోడీ ఎప్పుడూ కాంగ్రెస్ని అర్బన్ నక్సలైట్ పార్టీగా ముద్ర వేస్తారు. అది ఆయనకు అలవాటే. అయితే, ఆయన సొంత పార్టీ సంగతేంటి..? బీజేపీ ఉగ్రవాదుల పార్టీ, హత్యలకు పాల్పడుతోంది. ఇలాంటి ఆరోపణలు చేసే హక్కు మోడీకి లేదు.’’ అని ఖర్గే అన్నారు.
Also Read
అక్టోబర్ 05న కాంగ్రెస్ని అర్బన్ నక్సల్స్ సమూహం నియంత్రిస్తోందని, ఆపార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించడానికి ప్రజలు కలిసి రావాలని ప్రధాని మోడీ కోరారు. మహారాష్ట్ర ఎన్నికల ముందు వాషిమ్లో జరిగిన సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. “మనమంతా ఏకమైతే, దేశాన్ని విభజించాలనే వారి ఎజెండా విఫలమవుతుంది. భారతదేశం పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తులతో కాంగ్రెస్ ఎంత సన్నిహితంగా ఉందో అందరూ చూస్తున్నారు. దళితులను దళితులుగా, పేదలను పేదలుగా ఉంచాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కాబట్టి, కాంగ్రెస్తో జాగ్రత్త. కాంగ్రెస్ను అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారు. ఆ పార్టీ దేశాన్ని విభజించాలనుకుంటోంది, అందుకే మనల్ని విభజించాలని చూస్తోంది. కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కుట్రను భగ్నం చేయడానికి ఐక్యంగా ఉండండి. కలిసి ఉండాల్సిన సమయం ఇదే’’ అని ప్రధాని అన్నారు.
అక్టోబర్ 09న హర్యానా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలిచిన తర్వాత మళ్లీ అర్బన్ నక్సల్స్ అని ప్రధాని ప్రస్తావించారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం దేశం మూడ్ని తెలియజేస్తుందని, కాంగ్రెస్, అర్బన్ నక్సల్స్ విద్వేషపూరిత కుట్రలకు తాము బలికాబోమని ప్రజలు నిరూపించారని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!