BJP attack on Congress sitting MLA: బీజేపీ అభ్యర్థి దాడి..! 15 కిలోమీటర్లు పరిగెత్తి ప్రాణాలు నిలుపుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ జరుగుతోన్న వేళ.. సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంతి ఖరాడీ.. బనస్కాంత జిల్లా దంతా ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే… తనపై బీజేపీ అభ్యర్థి లాధు పర్ఘీ, అతడి అనుచరులు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు గుప్పించారు.. వారి నుంచి తన ప్రాణాలు కాపాడుకోడానికి 15 కిలోమీటర్లు పరిగెత్తాల్సి వచ్చిందని పేర్కొన్నారు.. అయితే, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్నేష్ మేవానీ.. అదృశ్యమైన పార్టీ అభ్యర్థి గురించి సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకున్నారు. “కాంగ్రెస్ అభ్యర్థి కాంతిభాయ్ ఖరాడిపై బీజేపీ అభ్యర్థి మరియు పార్టీ గూండాలు దాడి చేశారు, ఎన్నికల సమయంలో వివిధ గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తలను కలిసి తిరిగి వస్తుండగా, అతని కారును అడ్డగించి దాడి చేశారు, అతనిని చంపడానికి ప్రయత్నించారని.. కాంతిభాయ్ ఇప్పటికీ కనిపించలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ మేవానీ ట్వీట్లో పేర్కొన్నారు.
Read Also: Gujarat Election: గుజరాత్లో చివరి దశ పోలింగ్.. త్రిముఖ పోరులో ఉత్కంఠ
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
ఇక, కాంతి ఖరాడిపై దాడి జరిగినట్లు కంట్రోల్ రూమ్కు సమాచారం అందిందని బనస్కథ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ ధృవీకరించారు. ఈ ఘటన హదాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్సింగ్ వాఘేలా ఖారాడీకి చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. “నేను మాట్లాడటానికి మరియు పోలీసు సూపరింటెండెంట్ జోక్యాన్ని కోరడానికి ప్రయత్నించినప్పటికీ, అతను నా కాల్కు స్పందించలేదని విమర్శించారు.. అయితే, ఇదంతా జరిగిన తర్వాత.. తనపై జరిగిన దాడిని బయటపెట్టారు ఎమ్మెల్యే కాంతి ఖరాడీ.. నా నియోజకవర్గంలోని ఓటర్లను కలవడానికి వెళ్తుండగా బీజేపీ అభ్యర్థి లాధు పర్ఘీ, మరి కొందరు నేతలు నాపై దాడి చేశాడు.. ఆయుధాలతో వచ్చినవాళ్లు నాపై కత్తులతో ఎగబడ్డారు.. మా వాహనాలు బమోదర నాలుగు లైన్ రహదారిపై వెళ్తుండగా బీజేపీ అభ్యర్థి మా దారికి అడ్డుగా వచ్చాడు.. ఆ తర్వాత మేము తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాం.. అప్పుడు ఎక్కువ మంది వచ్చి మాపై దాడి చేశారు.. అక్కడ నుంచి మేం వెన్కి వస్తుండగా కొన్ని కార్లు మమ్మల్ని వెంబడించాయి.. బీజేపీ అభ్యర్థి లాతు పర్ఘీ, మరో ఇద్దరు ఆయుధాలు, కత్తులతో వచ్చారు.. మేం తప్పించుకుని 10-15 కిలోమీటర్లు పరిగెత్తామని.. దాదాపు 2 గంటలు అడవిలోనే ఉన్నామని.. రాత్రి చీకట్లో దాదాపు 15 కిలోమీటర్లు పరిగెత్తుతూ బీజేపీ గూండాల దాడి నుంచి తన ప్రాణాలను కాపాడుకున్నానని వెల్లడించారు ఎమ్మెల్యే కాంతి ఖరాడీ.. తుది దశ పోలింగ్ జరుగుతోన్న సమయంలో బయటపకు వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
-
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!