Gujarat Election: గుజరాత్లో చివరి దశ పోలింగ్.. త్రిముఖ పోరులో ఉత్కంఠ
దేశవ్యాప్తంగా ఉత్కంఠరేపుతోన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో తుది విడత ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది.. ఆయా స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది.. మూడు దశాబ్దాలుగా గుజరాత్ను ఏలుతోన్న బీజేపీ.. ఈ సారి అత్యధికంగా ఓట్లు, సీట్లు గెలిచి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. తొలిసారే సత్తాచాలాని ఆప్ తీవ్రంగా శ్రమిస్తోంది. తుది దశ పోలింగ్ జరుగుతోన్న నార్త్ గుజరాత్లో గతంలో కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు సాధించిన బీజేపీకి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: Astrology : డిసెంబర్ 05, సోమవారం దినఫలాలు
Also Read
- Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ 'ప్లాన్-బి' రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
- Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
- Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
- Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
గుజరాత్లో మొత్తం మొత్తం 182 సీట్లు ఉంటే డిసెంబర్ 1వ తేదీన తొలి విడతలో 89 సీట్లకు పోలింగ్ జరిగింది.. 63.31 శాతం పోలింగ్ నమోదైంది. ఇవాళ రెండో దశలో మిగిలిన స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.. ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ఆద్మీతో కలిపి 61 పార్టీల నుంచి మొత్తంగా 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.. బీజేపీ, ఆప్ 93 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టగా.. కాంగ్రెస్ 90 చోట్ల పోటీ చేస్తూ.. తన మిత్రమక్షమైన ఎన్సీపీ అభ్యర్థులను రెండుచోట్ల నుంచి బరిలోకి దించింది.. ఇక, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) 12 చోట్ల, బీఎస్పీ 44 చోట్ల పోటీ చేస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ అంతా తానై ప్రచారం నిర్వహించారు.. ర్యాలీలు, సభలు, రోడ్షోలతో హోరెత్తించారు.. ఒక, తుది దశలో మొత్తం 2.51కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1.29 కోట్ల మంది పురుషులు, 1.22కోట్ల మంది మహిళలు ఉన్నారు. అలాగే 18 నుంచి 19ఏళ్ల యువ ఓటర్లు 5.96లక్షల మంది ఉండటం గమనార్హం. రెండో దశ కోసం 14,975 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1.13లక్షల మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు.
తాజావార్తలు
-
Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్మీ స్మార్ట్ఫోన్ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
-
AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!