Congress: రూ.382 కోట్ల హెల్త్ స్కామ్తో కేజ్రీవాల్కి సంబంధం..కాంగ్రెస్ సంచలన ఆరోపణ..
- హెల్త్ స్కామ్తో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధం..
- ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేసింది. రూ. 382 కోట్ల విలువైన హెల్త్ కుంభకోణంలో కేజ్రీవాల్కి సంబంధం ఉందని ఆరోపించింది. ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ బుధవారం మాట్లాడుతూ.. కాగ్ నివేదిక కేజ్రీవాల్ నిర్వహించిన ఆరోగ్య సంబంధిత కుంభకోణాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. అవినీతిపై పోరాడుతానని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆయనే అవితీని చేసినట్లు కాగ్ వెల్లడించిందని అన్నారు.
Read Also: Katchatheevu: “కచ్చతీవు”పై ఇందిరా గాంధీని ప్రశంసించిన కాంగ్రెస్.. అన్నామలై తీవ్ర విమర్శలు..
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
మూడు ఆస్పత్రుల అదనపు ఖర్చులను ప్రవేశపెట్టకుండా కేజ్రీవాల్ అడ్డకున్నారని మాకెన్ ఆరోపించారు. కాగ్ నివేదికలో మూడు ఆస్పత్రుల టెండర్ల కన్నా రూ. 382 కోట్లు ఎక్కువ ఖర్చు చేశారని చూపించిందని, శాసనసభలో కాగ్ నివేదిక సమర్పించడానికి కేజ్రీవాల్ అనుమతి కూడా ఇవ్వలేదని, ఈ స్కామ్ వెలుగులోకి వస్తుందనే ఇలా చేశారని మాకెన్ సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ పాలన సమయంలో ఈ ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభమైందని, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఈ నిర్మాణాలను జాప్యం చేసిందని మాకెన్ చెప్పారు. గత 10 ఏళ్ల ఆప్ పాలనా కాలంలోని ఆస్పత్రుల నిర్మాణం పూర్తైందని కాగ్ చెప్పిందని, ఇందిరాగాంధీ ఆస్పత్రికి అదనంగా రూ. 314 కోట్లు, బురారి ఆస్పత్రికి రూ. 41 కోట్లు, మౌలానా ఆజాద్ డెంటల్ ఆస్పత్రికి రూ. 26 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. కోవిడ్-19 సమయంలో కేంద్రం అందించిన రూ. 653 కోట్ల గ్రాంట్లలో రూ. 360 కోట్లు ఖర్చు చేయలేదని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఆప్ తాను ప్రకటించిన 32,000 పడకలకు బదులుగా కేవలం 1235 పడకలను మాత్రమే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2016-17 నుండి 2021-22 వరకు, నాలుగు వేర్వేరు బడ్జెట్లలో, వారు 32,000 మెడికల్ బెడ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు… కానీ 1,235 పడకలు మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయని వెల్లడించారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!