PM Modi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరాన్ని బుల్డోజ్ చేస్తారని ఆయన ఆరోపించారు. బుల్డోజర్లు ఎక్కడ నడపాలనే విషయంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గర ట్యూషన్ తీసుకోవాలని శుక్రవారం అన్నారు. బీజేపీ హ్యాట్రిక్ సాధించబోతోందని, కొత్త ప్రభుత్వంలో పేదలు, యువత, మహిళలు, రైతుల కోసం ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, దాని కోసమే తాను ఇక్కడికి వచ్చానని బారాబంకీ, మోహన్లాల్ గంజ్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. జూన్ 4 ఎంతో దూరం లేదని, ఆ రోజు మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందని దేశానికి, ప్రపంచానికి తెలుసని చెప్పారు.
Read Also: Shocking incident: ఇంటికి వెళ్తున్న బాలికపై తాగుబోతు వేధింపులు.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
దేశ ప్రయోజనాల కోసం బీజేపీ-ఎన్డీయే కూటమి ఒక వైపు ఉంటే మరోవైపు దేశంలో అస్థిరత సృష్టించేందుకు ‘ఇండియా కూటమి’ ఉందని విమర్శించారు. ఎన్నికలు పురోగమిస్తున్నా కొద్దీ ఇండియా కూటమిని ప్రజలు పేకమేడలా కూల్చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి కానీ, మోడీని తిట్టేవారు కాదని అందుకు మీరు బీజేపీకి ఓటేయాలని ప్రజల్ని కోరారు. 100 సిసి ఇంజన్తో 1000 సిసి స్పీడ్ని సాధించగలరా? మీరు వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటే, బలమైన ప్రభుత్వం మాత్రమే దానిని అందించగలదని చెప్పారు.
రామనవమి రోజు సమాజ్వాదీ పార్టీ నేత ఒకరు రామ మందిరం పనికి రాదని అన్నారు. అదే సమయంలో రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని, వారికి వారి కుటుంబం, అధికారం మాత్రమే ముఖ్యమని ఆరోపించింది. ఎస్పీ-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్ లల్లాను మరోసారి గుడారంలోకి పంపి, గుడిని కూల్చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్డోజర్లు ఎక్కడ ఉపయోగించాలో యోగి దగ్గర ట్యూషన్ తీసుకోవాలని, యోగి ప్రభుత్వం రాష్ట్రంలో నేరస్తుల ఆస్తుల్ని బుల్డోజర్లను ఉపయోగించి ధ్వంసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు రాజకీయాల కంటే ఏదీ ఎక్కువ కాదని చెప్పారు. ట్రిపుల్ తలాక్ పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!