PM Modi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరాన్ని బుల్డోజ్ చేస్తారని ఆయన ఆరోపించారు. బుల్డోజర్లు ఎక్కడ నడపాలనే విషయంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గర ట్యూషన్ తీసుకోవాలని శుక్రవారం అన్నారు. బీజేపీ హ్యాట్రిక్ సాధించబోతోందని, కొత్త ప్రభుత్వంలో పేదలు, యువత, మహిళలు, రైతుల కోసం ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, దాని కోసమే తాను ఇక్కడికి వచ్చానని బారాబంకీ, మోహన్లాల్ గంజ్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. జూన్ 4 ఎంతో దూరం లేదని, ఆ రోజు మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందని దేశానికి, ప్రపంచానికి తెలుసని చెప్పారు.
Read Also: Shocking incident: ఇంటికి వెళ్తున్న బాలికపై తాగుబోతు వేధింపులు.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు..
Also Read
- Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
- Akhil NRD: "ప్రేమ పెళ్లి".. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
దేశ ప్రయోజనాల కోసం బీజేపీ-ఎన్డీయే కూటమి ఒక వైపు ఉంటే మరోవైపు దేశంలో అస్థిరత సృష్టించేందుకు ‘ఇండియా కూటమి’ ఉందని విమర్శించారు. ఎన్నికలు పురోగమిస్తున్నా కొద్దీ ఇండియా కూటమిని ప్రజలు పేకమేడలా కూల్చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి కానీ, మోడీని తిట్టేవారు కాదని అందుకు మీరు బీజేపీకి ఓటేయాలని ప్రజల్ని కోరారు. 100 సిసి ఇంజన్తో 1000 సిసి స్పీడ్ని సాధించగలరా? మీరు వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటే, బలమైన ప్రభుత్వం మాత్రమే దానిని అందించగలదని చెప్పారు.
రామనవమి రోజు సమాజ్వాదీ పార్టీ నేత ఒకరు రామ మందిరం పనికి రాదని అన్నారు. అదే సమయంలో రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని, వారికి వారి కుటుంబం, అధికారం మాత్రమే ముఖ్యమని ఆరోపించింది. ఎస్పీ-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్ లల్లాను మరోసారి గుడారంలోకి పంపి, గుడిని కూల్చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్డోజర్లు ఎక్కడ ఉపయోగించాలో యోగి దగ్గర ట్యూషన్ తీసుకోవాలని, యోగి ప్రభుత్వం రాష్ట్రంలో నేరస్తుల ఆస్తుల్ని బుల్డోజర్లను ఉపయోగించి ధ్వంసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు రాజకీయాల కంటే ఏదీ ఎక్కువ కాదని చెప్పారు. ట్రిపుల్ తలాక్ పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!