CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
- 20 ఏళ్ల తర్వాత సీఎం విజయ్ కీలక నిర్ణయం
- మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
- ఉద్యోగుల సంక్షేమం కోసమేనని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టాస్మాక్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని టాస్మాక్ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను 25 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాస్మాక్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే కావడం విశేషం.
రాష్ట్ర నిషేధం, ఎక్సైజ్ శాఖ మంత్రి విఘ్నేశ్ మాట్లాడుతూ.. ఈ వేతనాల పెంపు వెనుక ప్రధాన ఉద్దేశం ఉద్యోగులు మద్యం సీసాలపై అదనంగా డబ్బులు వసూలు చేసే పరిస్థితిని అరికట్టడమేనని తెలిపారు. టాస్మాక్ దుకాణాల్లో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకురావడంతో పాటు అవినీతిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read
- Gurugram: గురుగ్రామ్పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే
- Bihar: ప్రశాంత్ కిషోర్కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్లో టఫ్ ఫైట్
- Wayanad: వయనాడ్లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
- Modi-Indonesia: భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు.. తీరనున్న జలసంధి కష్టాలు
ప్రస్తుతం తమిళనాడులోని టాస్మాక్ దుకాణాల్లో ప్రతి మద్యం సీసాపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై వినియోగదారుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరచడంతో పాటు అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం విక్రయ కేంద్రాల నిర్వహణలో సంస్కరణలు చేపడుతోంది. ఉద్యోగుల వేతనాల పెంపు కూడా అదే సంస్కరణల్లో భాగంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో టాస్మాక్ పరిధిలో 38 జిల్లా కార్యాలయాలు, 43 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) డిపోలు, 4,787 రిటైల్ మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 2,362 బార్లు నిర్వహణలో ఉన్నాయి. ఉద్యోగుల వేతనాల పెంపు వల్ల వారి సంక్షేమం మెరుగుపడటంతో పాటు వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేసే సమస్య కూడా తగ్గుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
-
CM Revanth Reddy : కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం
-
Gurugram: గురుగ్రామ్పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే
-
Sanju Samson: సంజూ.. సంజూ.. సంజూ.. భారీగా పెరుగుతున్న మద్దతు.. ‘మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా’..
-
Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. ‘హృదయం మురళి’ ట్రైలర్ చూశారా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!