CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
- 20 ఏళ్ల తర్వాత సీఎం విజయ్ కీలక నిర్ణయం
- మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
- ఉద్యోగుల సంక్షేమం కోసమేనని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టాస్మాక్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని టాస్మాక్ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను 25 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాస్మాక్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే కావడం విశేషం.
రాష్ట్ర నిషేధం, ఎక్సైజ్ శాఖ మంత్రి విఘ్నేశ్ మాట్లాడుతూ.. ఈ వేతనాల పెంపు వెనుక ప్రధాన ఉద్దేశం ఉద్యోగులు మద్యం సీసాలపై అదనంగా డబ్బులు వసూలు చేసే పరిస్థితిని అరికట్టడమేనని తెలిపారు. టాస్మాక్ దుకాణాల్లో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకురావడంతో పాటు అవినీతిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read
- Supreme Court: నిబంధనలు పాటించని విమాన సంస్థలు నిలిపేయండి.. కేంద్రానికి ఆదేశం
- Jobless: డిగ్రీలు ఉన్నా జాబ్ దొరకకపోవడానికి కారణం ఇదేనా..? వైరల్ అవుతున్న నిరుద్యోగి సంచలన వ్యాఖ్యలు..
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
- Marathi Test: మహారాష్ట్రలో 7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ పరీక్షలో ఫెయిల్.. ఇక లైసెన్స్ పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం తమిళనాడులోని టాస్మాక్ దుకాణాల్లో ప్రతి మద్యం సీసాపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై వినియోగదారుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరచడంతో పాటు అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం విక్రయ కేంద్రాల నిర్వహణలో సంస్కరణలు చేపడుతోంది. ఉద్యోగుల వేతనాల పెంపు కూడా అదే సంస్కరణల్లో భాగంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో టాస్మాక్ పరిధిలో 38 జిల్లా కార్యాలయాలు, 43 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) డిపోలు, 4,787 రిటైల్ మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 2,362 బార్లు నిర్వహణలో ఉన్నాయి. ఉద్యోగుల వేతనాల పెంపు వల్ల వారి సంక్షేమం మెరుగుపడటంతో పాటు వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేసే సమస్య కూడా తగ్గుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Suriya Vs Lokesh: లోకేష్ కనగరాజ్’కు సూర్య మార్క్ షాక్?
-
Irumudi: ఇరుముడిపై టాక్సిక్ ఎఫెక్ట్?
-
Supreme Court: నిబంధనలు పాటించని విమాన సంస్థలు నిలిపేయండి.. కేంద్రానికి ఆదేశం
-
Jobless: డిగ్రీలు ఉన్నా జాబ్ దొరకకపోవడానికి కారణం ఇదేనా..? వైరల్ అవుతున్న నిరుద్యోగి సంచలన వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!