Rekha Gupta Attacked: ఢిల్లీ సీఎంకు చేదు అనుభవం.. రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టిన యువకుడు
- ఢిల్లీ సీఎంకు చేదు అనుభవం
- రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టిన యువకుడు
- నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఉదయం తన నివాసంలో రేఖా గుప్తాను ఒక యువకుడు చెంపదెబ్బ కొట్టాడు. ఈ హఠాత్పరిణామంతో రేఖా గుప్తా సహా అధికారులు షాక్కు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Archana Tiwari: వీడిన రైల్లో అదృశ్యమైన అర్చన తివారీ మిస్టరీ! ఏమైందంటే..!
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టి, జుట్టు లాగడంతో ఆసుపత్రి పాలయ్యారని బీజేపీ నాయకులు తెలిపారు. 30 ఏళ్ల వయసున్న యువకుడు ‘జనసభ’ సందర్భంగా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి దాడికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై దాడి చేసిన యువకుడిని పట్టుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Centres Bills: నేరం చేస్తే ప్రధాని, సీఎంలు తొలగింపు.. నేడు పార్లమెంట్ ముందుకు బిల్లు
ముఖ్యమంత్రి నివాసంలో జనసభ జరుగుతుండగా రేఖా గుప్తాపై తొలుత యువకుడు గట్టిగా అరిచాడు. అనంతరం ఆమె చెంపపై కొట్టాడు. అనంతరం దుర్భాషలాడాడు. ముఖ్యమంత్రితో యువకుడు తీవ్ర ఘర్షణకు దిగాడు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది అడ్డుకోకపోవడం పెద్ద భద్రతా లోపంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం దగ్గర భారీగా భద్రతా పెంచారు. ఒక యువకుడు అంత దగ్గరగా ముఖ్యమంత్రి దగ్గరకు ఎలా వెళ్లాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు తొలుత ఒక పత్రాన్ని సమర్పించాడు. వెంటనే ఆమెపై అరవడం ప్రారంభించాడు. ఇంతలోనే చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడాడు. అయితే అతడి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న వ్యక్తే ఈ దాడి చేసినట్లుగా ఆ పార్టీ అధికారి ప్రతినిధి ప్రవీణ్ శంకర్ వ్యాఖ్యానించారు. అంటే పార్టీలో అంతర్గత విభేదాలు కారణంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని కాషాయ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!