CM KCR Meets LaluPrasad Yadav: లాలూప్రసాద్ యాదవ్ తో కేసీఆర్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సుదీర్ఘ భేటీ అనంతరం బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్. తేజస్వీ యాదవ్ తండ్రి….మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను పలకరించి ఆయన ఆరోగ్యం, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. లాలూ నివాసంలో ఆయనతో కలిసి తేనీరు సేవించారు. సమకాలీన రాజకీయ అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యుల్ని కేసీఆర్ పలకరించారు. గతంలో అనారోగ్యంతో బాధపడుతోన్న లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇంట్లో జారిపడి పడటంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయన కోలుకున్నారు. తేజస్వితో కలిసి సీఎం కేసీఆర్ లాలూని కలిశారు.
Read Also: CM Jagan: కడప జిల్లాలో మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!!
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
అంతకుముందు బీజేపీ ముక్త్ భారత్ కోసం విపక్షాలు కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చామన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని, అందుకే దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని, ఈ విషయం గురించి నితీశ్తో కూడా చర్చించామని చెప్పారు. దేశానికి రొటీన్ ప్రభుత్వాలు వద్దని, భారత్ను మార్చే ప్రభుత్వం రావాలని చెప్పారు. బీజేపీ కేవలం అబద్ధాలతోనే పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో విపక్షాలను ఏకం చేసే విషయమై నితీశ్తో చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలను బలహీనరపరిచేందుకు దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటోందని కేంద్రంపై మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని నరేంద్ర మోదీ సర్కారు ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై దాడులకు తెగబడుతోందని ఆయన విమర్శించారు. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమని కేసీఆర్ చెప్పుకొచ్చారు. సీబీఐ ప్రవేశాన్ని నిరాకరిస్తూ బీహార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్న కేసీఆర్.. మిగిలిన అన్ని రాష్ట్రాలు ఇదే పని చేయాలని పిలుపునిచ్చారు.
Read Also: Kadiam Constable: ఆమెతో కానిస్టేబుల్ రాసలీలలు.. నడిరోడ్డుపై నగ్నంగా
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!