తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బిహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12:15 గంటలకు పాట్నాకి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన ప్రకారం గాల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈనేపథ్యంలో సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించిన అనంతరం…