CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
- జైపూర్లో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన CJP బృందంపై గ్రామస్తుల దాడి.
- CJP కార్యకర్తలను అడ్డుకుని, దూషించి, వెంబడించినట్లు వైరల్ వీడియోలు.
- బృందంపై దాడి వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని CJP ఆరోపణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: రాజస్థాన్ జైపూర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన కాక్రోచ్ జనగా పార్టీ(CJP) వ్యక్తుల్ని గ్రామస్తులు తరిమికొట్టారు. ఈ ఘటనపై సీజేపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ గుండాలే దాడి చేశారని ఆరోపించారు. అయితే బీజేపీ మాత్రం గ్రామస్తులే సీజేపీ టీమ్ను వ్యతిరేకించారని అంటోంది. మరోవైపు, గ్రామస్తులు తమకు బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు.
జైపూర్లోని బాగ్రూ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంపురా-కన్వార్పురా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. CJP సహ వ్యవస్థాపకుడు ఆశుతోష్ రాంకా నేతృత్వంలోని బృందం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలించేందుకు గ్రామానికి వెళ్లింది. వైరల్ అవుతున్న వీడియోల్లో సీజేపీ కార్యకర్తల్ని గ్రామంలోని ప్రజలు దూషిస్తూ, వారిపై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. కొందరు వ్యక్తులు వారిని ‘‘ అర్బన్ నక్సల్స్’’, ‘‘దేశ వ్యతిరేకులు’’, ‘‘పాకిస్తానీలు’’ అంటూ నినాదాలు చేశారు. దాడి తర్వాత సీజేపీ బృందం పాఠశాలను సందర్శించకుండా వెళ్లిపోయింది.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
ఈ దాడిపై అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల కొన్నేళ్లుగా పశువుల కొట్టంలోనే నడుస్తోందని ఆరోపించారు. గత ఏడాది కూడా తాము ఆ స్కూల్ను పరిశీలించామని, ఈసారి వెళ్లే విషయాన్ని ముందుగా పోలీసులకు చెప్పామని అన్నారు. అయితే, తమ కార్యకర్తలపై దాడి జరిగిందని, కార్లను ధ్వంసం చేశారని, ఫోన్లు పగలగొట్టారని ఆరోపించారు. ఒక మహిళపై దాడి జరిగిందని, తమ టీమ్లో ఓ వ్యక్తి చేతికి ఫ్రాక్చర్ అయిందని తెలిపారు.
ఈ దాడి వెనక బీజేపీకి చెందిన నాయకులు ఉన్నారని అశుతోష్ రాంకా ఆరోపించారు. గ్రామస్తులు దాడి చేయలేదని, బయట నుంచి కొంతమందిని తీసుకువచ్చి హింసను ప్రేరేపించారని, స్థానిక బీజేపీ కౌన్సిలర్ కొందరు వ్యక్తులకు డబ్బులు పంచుతున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన సోషల్ మీడియాలో ఆరోపించారు. అయితే, బీజేపీ ఈ ఆరోపణల్ని ఖండించింది. గ్రామస్తులే సీజేపీ రాకను వ్యతిరేకించారని ఎమ్మెల్యే స్వామి బాలముకుందాచార్య అన్నారు. పిల్లల విద్యకు అంతరాయం కలిగించే వాతావరణాన్ని సృష్టించేందుకు సీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు.
जयपुर में स्कूल की जांच करने पहुंचे CJP नेता आशुतोष रांका पर हमला किया गया। लात घूंसों से मारपीट की गई, गाड़ियां तोड़ी, जमीन पर गिराकर मारा।
आशुतोष रांका का आरोप है कि ये बीजेपी के लोग हैं। ग्राम प्रधान भू माफिया है सरकारी स्कूल में तबेला खोल रखा है, सच्चाई सामने आने के डर से CJP… pic.twitter.com/iHeJHkSILI— Raja Pal (@Rraja_pal) August 21, 2026
తాజావార్తలు
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!