సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. జడ్జీల నియామకం, కోర్టుల బలోపేతంపై ప్రధానంగా దృష్టిసారిస్తుననారు.. ఇక, మరిన్ని జడ్జీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారాయన.. జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సు నిర్వహించారు… ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ హైకోర్టుల్లో జడ్జీల నియామకానికి పేర్లను సూచించాలని సంబంధిత హైకోర్టు చీఫ్ జస్టిస్లను కోరారు.. ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. సమష్టి కృషితో వివిధ హైకోర్టులలోని 126 ఖాళీలను ఏడాది లోపు భర్తీ చేయగలిగామని తెలిపిన ఆయన.. త్వరలో మరో 50 నియామకాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Dwarakanath Reddy: చంద్రబాబు దమ్ముంటే రా..!
కాగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఆరేళ్ల గ్యాప్ తర్వాత నిర్వహించారు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్ సహా అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థలో సంస్థాగత, చట్టపరమైన సంస్కరణలు అమలుకు శ్రీకారం చుట్టడంపై చర్చించారు.