CAA: పశ్చిమబెంగాల్లోని లబ్ధిదారులకు సీఏఏ కింద పౌరసత్వ పత్రాలు: కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAA: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద మొదటి దశ పౌరసత్వ ధృవీకరణ పత్రాలు జారీ చేసిన తర్వాత రెండు వారాల లోపే పశ్చిమ బెంగాల్లోని లబ్ధిదారులకు సీఏఏ పత్రాలు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్కు చెందిన మొదటి దరఖాస్తుదారులకు రాష్ట్ర సాధికార కమిటీ పౌరసత్వం మంజూరు చేసిందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 15న న్యూఢిల్లీలో దరఖాస్తుదారులకు చట్టం ప్రకారం మొట్టమొదటి సర్టిఫికేట్ల సెట్ను అందజేయడం జరిగింది.
అయితే బెంగాల్ వ్యాప్తంగా సీఏఏ అమలు కష్టంగా మారింది. ముఖ్యంగా బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కార్ దీనిని వ్యతిరేకిస్తోంది. హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సాధికార కమిటీలు కూడా మొదటి దరఖాస్తుదారులకు పౌరసత్వాన్ని మంజూరు చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read
- JNU: జేఎన్ యూ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
- Göbekli Tepe: పిరమిడ్లకంటే వేల ఏళ్ల ముందు నిర్మించిన ఆలయం.. దానిని నిర్మించినవాళ్లే ఎందుకు పూడ్చిపెట్టారు?
- Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
- High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
Read Also: Madhya Pradesh: వందేభారత్ లో భారీ పేలుడు.. భయాందోళనలో ప్రయాణికులు
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉండీ, వేధింపులకు గురై డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు మరియు పార్సీలలకు ఈ సీఏఏ చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని కల్పించనున్నారు. వీరి అర్హత వ్యవధిని 11 నుంచి 5 ఏళ్లకు తగ్గించింది. సీఏఏ నియమాలు ఈ ఏడాది మార్చిలో నోటిఫై చేయబడ్డాయి.
మరోవైపు ఈ ఎన్నికల ప్రచారంలో సీఏఏ బెంగాల్ ప్రచారంలో ప్రముఖంగా మారింది. బీజేపీ నేతలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. బెంగాల్ సరిహద్దుల్లో జనాభా స్వరూపం మార్చబడుతోందని, మతపరమైన హింసకు గురైన వారికి పౌరసత్వం ఇవ్వడానికి టీఎంసీ వ్యతిరేకమని, ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ ప్రశ్నించారు. బెంగాల్లో హిందువులు, మతువా కమ్యూనిటీలు ఉండకూడదని టీఎంసీ భావిస్తోందని దుయ్యబట్టారు. అయితే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీని అమలు చేయకుండా అడ్డుకుంటానని, ఇందుకు ప్రాణత్యాగానికి కూడా వెనకాడనని అన్నారు.
తాజావార్తలు
-
Malaika Arora: అర్జున్ కపూర్తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!