Abhishek Banerjee: “నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు”.. చిక్కుల్లో మమత మేనల్లుడు
- ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో అభిషేక్ బెనర్జీకి సీఐడీ నోటీసు.
- ఇది రాజకీయ కక్షసాధింపు అని అభిషేక్ ఆరోపణలు
- నా గొంతు కోసినా, భయపడనని కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతడిపై పలు కేసుల్లో విచారణ జరుగుతోంది. తాజాగా బెంగాల్ సీఐడీ అతడిని విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వెళ్లింది. శనివారం మధ్యాహ్నం అభిషేక్ కార్యాలయం అయిన ‘‘శాంతినికేతన్’’కు చేరుకుని నోటీసులు ఇవ్వాలని అధికారులు ప్రయత్నించారు. సోమవారం సీఐడీ కార్యాలయం భవానీ భవన్కు విచారణ కోసం రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో అభిషేక్ అక్కడ లేకపోవడంతో నోటీసులు తీసుకోలేదు.
మరో సీఐడీ బృందం కాళీఘాట్లోని మరో ఆఫీసులోకి వెళ్లి అక్కడ అభిషేక్ బెనర్జీకి నోటీసలు అందించారు. ఈ వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ.. తాను ఇంకా నోటీసును పూర్తిగా చదవలేదని చెప్పారు. న్యాయవాదులతో చర్చించిన తర్వాత అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. తనపై కేంద్ర సంస్థలు, రాష్ట్రపోలీసులు, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Also Read
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
- DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
- Accidnet: ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
- Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
‘‘వారు ఏమి చేయాలనుకుంటే అది చేసుకోనివ్వండి. వారికి నచ్చినట్లు వారు ప్రవర్తించవచ్చు. ఇంతకుముందు కేవలం ED, CBI మాత్రమే ఉండేవి, ఇప్పుడు వాటితో పాటు బెంగాల్ పోలీసులు, కోల్కతా పోలీసులు , KMC (కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్) కూడా జతకలిశాయి. ఇంతకుముందు 2–3 దర్యాప్తు సంస్థలు ఉండేవి, ఇప్పుడు ఆ సంఖ్య 5కి చేరింది. నాపై 5–6 సంస్థలను ఉసిగొలిపి, బ్లాక్మెయిల్ చేయడం ద్వారా నన్ను భయపెట్టి లొంగదీసుకోవచ్చని వారు భావిస్తున్నారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. మీరు నా గొంతు కోసినా సరే, మీకు నచ్చినట్లు ఏది చేసినా సరే… నన్ను లొంగదీసుకోవాలంటే ఏడు జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. నేను దేశద్రోహిని కాదు’’ అని ఆయన అన్నారు.
సంతకాల ఫోర్జరీ కేసు ఏంటి.?
టీఎంసీ ఓడిపోయిన తర్వాత, అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా సీనియర్ నేత సోవన్ దేబ్ చటర్జీ ఎంపిక లేకపై కొంతమంది ఎమ్మెల్యేల సంతకాలను వారి అనుమతది ల లేకుండా ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు కునాల్ ఘోష్, నయనా బందోపాధ్యాయలను సీఐడీ విచారించింది.
తాజావార్తలు
-
Abhishek Banerjee: “నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు”.. చిక్కుల్లో మమత మేనల్లుడు
-
Vinesh Phogat: వినేష్ ఫోగట్కు బిగ్ షాక్.. ఆసియా క్రీడల నుంచి ఔట్
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..