China: చైనా రెచ్చగొట్టే చర్య.. వాస్తవాధీన రేఖ వద్దకు యుద్ధ విమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: సరిహద్దుల్లో కొద్ది రోజల వరకు కిమ్మనకుండా ఉన్న చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దు నిబంధనలను అతిక్రమించింది. కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల తర్వాత కూడా, చైనా యుద్ధ విమానాలు తూర్పు లద్ధాఖ్లో మోహరించి భారత బలగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. గత మూడు నాలుగు వారాల్లో వాస్తవాధీన రేఖకు దగ్గరగా డ్రాగన్కు చెందిన విమానాలు ఎగురుతూనే ఉన్నాయి. ఇలా విమానాలు ఎగరడం ఆ ప్రాంతంలోని భారత రక్షణ యంత్రాంగాన్ని పరిశోధించే చర్యగా పరిగణించవచ్చు. భారత వైమానిక దళం పరిస్థితులకు తగ్గట్లుగా ప్రతిస్పందిస్తోంది. జే-11తో సహా చైనా యుద్ధ విమానాలు వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా ఎగురుతూనే ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో 10 కిమీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ రేఖను ఉల్లంఘించిన సందర్భాలు ఉన్నాయని తెలిపాయి.
Monkeypox Cases: ఒకే వ్యక్తిలో మంకీపాక్స్, కరోనా.. అధికారుల హైఅలర్ట్
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
ఈ రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం గట్టి చర్యలు చేపట్టింది. మిగ్-29,మిరాజ్ 2000తో సహా అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలను స్థావరాలకు తరలించింది. చైనా చర్యలకు నిమిషాల్లోనే సమాధానం చెప్పొచ్చని అధికారిక వర్గాలు ప్రకటించాయి. డ్రాగన్ ముప్పును అధిగమించడానికి భారత వైమానిక దళం ఫైటర్ జెట్లను సిద్ధం చేసింది. చైనీస్ విమానాలను భారత దళాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి. జూన్ చివరి వారంలో చైనా యుద్ధ విమానం ఎల్ఏసీ ప్రాంతంలో కొన్ని నిమిషాల పాటు తిరిగింది. దీంతో భారత రాడార్లు గుర్తించి అలెర్ట్ చేశాయి. వెంటనే భారత ఫైటర్ జెట్స్ రంగంలోకి దిగడంతో చైనా యుద్ధ విమానం తోక ముడిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. చైనా యుద్ధ విమానాలను సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కి దగ్గరగా గుర్తించిన వెంటనే తాము చాలా వేగంగా స్పందిస్తామని, ఫైటర్ విమానాలతోపాటు అన్ని వ్యవస్థలను హై అలెర్ట్ చేస్తామని భారత వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?