India-China: భారత్ చైనాను నమ్మవద్దు, చక్కెర ఆరోగ్యానిక హానికరం: టిబెట్ లీడర్..
- భారత్ ఎప్పటికీ చైనాను నమ్మొద్దు..
- భారత్ను హెచ్చరించిన టిబెటియన్ లీడర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China: చైనాను ఏ రకంగా కూడా నమ్మలేని, భారత్ను హెచ్చరిస్తూ టిబెల్ లీడర్ లోబ్సాంగత్ సంగే అన్నారు. ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ మాజీ అధ్యక్షుడు(సిక్యాంగ్) లోబ్సాంగ్ సంగే జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తోందని, భారత్ డ్రాగన్ దేశాన్ని ఎప్పుడూ నమ్మవద్దని హెచ్చరించారు. చైనా, భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు గ్రామాలకు పేర్లు మార్చడం, సరిహద్దుల్లో సైనిక మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సంగే నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
గతంలో భారత్ను చైనా నమ్మించి ద్రోహం చేసిన సంఘటనలను ఆయన వివరించారు. ‘‘పంచశీల్పై 1954లో సంతకం చేశారు, 1962 నాటికి యుద్ధం మొదలైంది. 1979లో అటల్ బిహారీ వాజ్పేయి విదేశాంగ మంత్రిగా చైనాను సందర్శించినప్పుడు, వియత్నాం యుద్ధం కొనసాగుతోంది. జి జిన్పింగ్ 2015లో భారతదేశానికి వచ్చారు, రెండు సంవత్సరాలలోపు డోక్లాం జరిగింది. 2019లో, భారతదేశం- చైనా 70 సంవత్సరాల సంబంధాలను జరుపుకున్నాయి, దీని తర్వాత 2020లో గాల్వాన్ ఘటన జరిగింది’’ అని చెప్పారు.
Also Read
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
Read Also: Garba Rules: “సరైన దుస్తులు, సిందూరం, ఆధార్”.. నవరాత్రి గర్బా కోసం బజరంగ్ దళ్ నియమాలు..
14 ద్రోహాల తర్వాత కూడా భారత్ చైనాతో సంబంధాలను రీసెట్ చేస్తోందని, గతంలో జరిగిన దాడులు తాలూకూ గాయాలను స్కాచ్ టేప్తో కట్టిస్తున్నారని ఆయన అన్నారు. చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో హైస్పీడ్ రైల్వేలు, హైవేలు, సైనిక స్థావరాలను నిర్మిస్తోందని, వారు దండయాత్రకు సిద్ధమవుతున్నారని అన్నారు. చైనాకు టిబెట్ అరచేయి అయితే, లడఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఐదు వేళ్లుగా చెబుతోందని, వాటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందని సంగే అన్నారు.
హిమాలయాలను నియంత్రించడం అంటే దక్షిణాసియాపై పట్టు, ముఖ్యంగా భారత్పై ఆధిపత్యం చెలాయించడమని చైనా గురించి హెచ్చరించారు. ‘‘హిందీ-చిని భాయ్ భాయ్’’ అనే నినాదంలో ‘‘చిని’’ని చక్కెరతో పోల్చారు. హిందీ( భారత్), చిని(చైనా)ను ఎప్పుడూ తాకకూడదని, అది ఆరోగ్యానికి మంచిది కాదని అన్నారు. ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటే భారత్ ఆధిపత్యాన్ని తొలగించాలని, పోటీలో ఉండకూడదని చైనా భావిస్తోందని అన్నారు.
తాజావార్తలు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
-
India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
-
RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!