India-Pakistan Border: కాశ్మీర్ ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్కి చైనా సైనిక మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan Border: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో కాశ్మీర్ వెంబడి నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్కి చైనా సైనిక మద్దతు అందిస్తోంది. గత కొంత కాలంగా సరిహద్దు వెంబడి అత్యాధునిక సౌకర్యాలను పాకిస్తాన్ పెంపొందించుకుంటోంది. అయితే, చైనాతో ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉందని, సరిహద్దు వెంబడి ఎలాంటి బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధికారులు చెప్పారు.
పాకిస్తాన్ కీలక మిత్రదేశమైన చైనా గత మూడు సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసీ వెంబడి ఉక్కు బంకర్ల నిర్మాణంతో పాటు మానవరహిత వైమానికి, యుద్ధ విమానాల ఏర్పాటుతో సహా పాకిస్తాన్ సైన్యం రక్షణ సామర్థ్యాలను చురుకుగా పెంచుతోందని బుధవారం అధికారులు తెలిపారు. చైనా సహాయంతో హైలీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ టవర్స్ని ఇన్స్టాల్ కోసం ఎల్ఓసీ వెంబడి భూగర్భ ఫైబర్ కేబుల్స్ ఏర్పాటును కూడా విస్తరించింది. ఇదే కాకుండా చైనీస్ మూలాలకు చెందిన అధునాతన రాడార్ సిస్టమ్స్ ‘JY’ మరియు ‘HGR’ సిరీస్లు, మీడియం అండ్ లో అల్టిట్యూడ్ టార్గెట్ డిటెక్షన్ సామర్థ్యాలు మెరుగయ్యాయని తెలుస్తోంది.
Also Read
- Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
Read Also: Sithara Ent: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలోనూ అదే ఫాలో అవుతున్న నాగవంశీ!
వీటిలో పాటు చైనీస్ సంస్థ తయారు చేసి 155 mm ట్రక్కు-మౌంటెడ్ హోవిట్జర్ గన్, SH-15 ఉనికిని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రదేశాల్లో గుర్తించబడింది. ఈ చర్య వల్ల పాకిస్తాన్-చైనా సంబంధాలు బలోపేతం కావడంతో పాటు, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) వెంబడి నిర్మిస్తున్న చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(CPEC)కి సంబంధించిన చైనా పెట్టుబడులను కాపాడే ప్రయత్నాలలో భాగంగా పరిగణించబడుతుంది. 2014లో గుర్తించినట్లు, ఫార్వర్డ్ పోస్టుల వద్ద సీనియర్ చైనా అధికారుల ఉనికి కనిపించనప్పటికీ, చైనా దళాలు మరియు ఇంజనీర్లు నియంత్రణ రేఖ వెంబడి భూగర్భ బంకర్లను నిర్మించడంతో సహా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారని అధికారులు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని లీపా వ్యాలీలో చైనా నిపుణులు సొరంగం నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారని, కారకోరం హైవేతో అనుసంధానించడానికి ఆల్-వెదర్ రహదారికి సన్నాహాలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
చైనా వ్యూహాత్మక చర్యలో భాగంగా 46 బిలియన్ డాలర్లతో సీపెక్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సు మధ్య హైవే ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో గిల్గిట్ మరియు బాల్టిస్తాన్ ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ ప్రాంతంలో చైనా సైనిక సిబ్బంది కొనసాగడం ఆందోళనకు దారితీసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
-
Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
-
Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
-
Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!