India-Pakistan Border: కాశ్మీర్ ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్కి చైనా సైనిక మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan Border: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో కాశ్మీర్ వెంబడి నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్కి చైనా సైనిక మద్దతు అందిస్తోంది. గత కొంత కాలంగా సరిహద్దు వెంబడి అత్యాధునిక సౌకర్యాలను పాకిస్తాన్ పెంపొందించుకుంటోంది. అయితే, చైనాతో ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉందని, సరిహద్దు వెంబడి ఎలాంటి బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధికారులు చెప్పారు.
పాకిస్తాన్ కీలక మిత్రదేశమైన చైనా గత మూడు సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసీ వెంబడి ఉక్కు బంకర్ల నిర్మాణంతో పాటు మానవరహిత వైమానికి, యుద్ధ విమానాల ఏర్పాటుతో సహా పాకిస్తాన్ సైన్యం రక్షణ సామర్థ్యాలను చురుకుగా పెంచుతోందని బుధవారం అధికారులు తెలిపారు. చైనా సహాయంతో హైలీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ టవర్స్ని ఇన్స్టాల్ కోసం ఎల్ఓసీ వెంబడి భూగర్భ ఫైబర్ కేబుల్స్ ఏర్పాటును కూడా విస్తరించింది. ఇదే కాకుండా చైనీస్ మూలాలకు చెందిన అధునాతన రాడార్ సిస్టమ్స్ ‘JY’ మరియు ‘HGR’ సిరీస్లు, మీడియం అండ్ లో అల్టిట్యూడ్ టార్గెట్ డిటెక్షన్ సామర్థ్యాలు మెరుగయ్యాయని తెలుస్తోంది.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
Read Also: Sithara Ent: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలోనూ అదే ఫాలో అవుతున్న నాగవంశీ!
వీటిలో పాటు చైనీస్ సంస్థ తయారు చేసి 155 mm ట్రక్కు-మౌంటెడ్ హోవిట్జర్ గన్, SH-15 ఉనికిని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రదేశాల్లో గుర్తించబడింది. ఈ చర్య వల్ల పాకిస్తాన్-చైనా సంబంధాలు బలోపేతం కావడంతో పాటు, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) వెంబడి నిర్మిస్తున్న చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(CPEC)కి సంబంధించిన చైనా పెట్టుబడులను కాపాడే ప్రయత్నాలలో భాగంగా పరిగణించబడుతుంది. 2014లో గుర్తించినట్లు, ఫార్వర్డ్ పోస్టుల వద్ద సీనియర్ చైనా అధికారుల ఉనికి కనిపించనప్పటికీ, చైనా దళాలు మరియు ఇంజనీర్లు నియంత్రణ రేఖ వెంబడి భూగర్భ బంకర్లను నిర్మించడంతో సహా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారని అధికారులు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని లీపా వ్యాలీలో చైనా నిపుణులు సొరంగం నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారని, కారకోరం హైవేతో అనుసంధానించడానికి ఆల్-వెదర్ రహదారికి సన్నాహాలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
చైనా వ్యూహాత్మక చర్యలో భాగంగా 46 బిలియన్ డాలర్లతో సీపెక్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సు మధ్య హైవే ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో గిల్గిట్ మరియు బాల్టిస్తాన్ ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ ప్రాంతంలో చైనా సైనిక సిబ్బంది కొనసాగడం ఆందోళనకు దారితీసింది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!