sunitha krishnan: టెలిగ్రామ్, పేటీఎం, ఫోన్పే యాప్లపై చర్యలు తీసుకోవాలి.. సునీతాకృష్ణన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: దశాబ్ద కాలంగా సాంకేతికత చాల అభివృద్ధి చెందింది. పెరిగిన సాంకేతికతను కొందరు మంచికి వినియోగించుకుంటుంటే మరి కొందరు మాత్రం విజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లలు అని కనికరం లేకుండా అశ్లీల చిత్రాలను తీసి సోషల్ మీడియా వేదికగా విక్రయిస్తున్నారు. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ పైన స్పందించారు బాలల హక్కుల కార్యకర్త సునీతాకృష్ణన్. వివరాలలోకి వెళ్తే.. సునీతాకృష్ణన్ మంగళవారం డీజీపీ అంజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో టెలిగ్రామ్ యాప్ లో విచ్చలవిడిగా బాలల అశ్లీల(చైల్డ్ పోర్నోగ్రఫీ) వీడియోలు విక్రయిస్తున్నారని.. అందుకు గాను పేటీఎం, ఫోన్పేలలో రూ.50 చెల్లిస్తే చాలు బాలల అశ్లీల వీడియోల లింకులు పంపుతున్నారని.. ఆ వీడియోల్లో ఉన్న చిన్నారుల్లో.. భారత్కు చెందినవారు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది పేర్కొన్నారు.
Read also:BJP: రాష్ట్ర ఎన్నికలపై పాకిస్తాన్ కూడా కన్నేసింది.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
- Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
- My Son Is Innocent: కేతన్ హ*త్య కేసులో నా కొడుకును ఇరికిస్తున్నారు.. నేను సియాను ఇంతకు ముందెన్నడూ చూడలేదు..
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
కాగా తాను ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేయడం లేదని.. స్వయంగా మారుపేరుతో ‘గరల్స్ అండ్ బాయ్స్’ అనే చానల్లో చేరానని.. అనంతరం ఆ చానల్లో చిన్నారుల అశ్లీల దృశ్యాల అమ్మకంపై ప్రకటనలను చూసాను అని వెల్లడించారు. అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి విక్రేతను చాటింగ్లో సంప్రదించగా.. ఫోన్పే /పేటీఎంలో రూ.50 పంపమన్నారు అని.. డబ్బులు పంపిన తరువాత అశ్లీల వీడియోల లింకులు ఇచ్చారు అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆ చానల్లో 31వేల మంది సభ్యులున్నారు అని తెలిపారు. డీజీపీ టెలిగ్రామ్, పేటీఎం, ఫోన్పే యాప్లపై వెంటనే చర్యలు చర్యలు తీసుకోవాలని.. బాలల దినోత్సవం రోజున ఇస్తున్న ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని కోరారు. అయితే ఈ విషయం పైన టెలిగ్రామ్ కూడా స్పందించింది. ఈ తరహా చర్యలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అందుకుగాను ‘స్టాప్ చైల్డ్ అబ్యూస్’ అనే చానల్ను ఏర్పాటు చేసి, తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు రోజుకు 2000-3000 చానల్స్, గ్రూప్లను తొలగిస్తున్నట్లు వివరించింది.
తాజావార్తలు
-
1983 Cricket World Cup: “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం”.. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!
-
Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
-
Rohit Sharma-BCCI: రోహిత్ కోసమా.. భారత క్రికెట్ కోసమా?.. సెలెక్టర్లపై మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు!
-
Peddi VS Devara : ‘దేవర’ని అందుకోలేకపోయిన ‘పెద్ది’.. ఛాన్స్ మిస్
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!