Chidambaram Nataraja Temple: చిదంబర ఆలయ సంపద వివాదం.. ప్రభుత్వంపై పురోహితులు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chidambaram Nataraja Temple issue:తమిళనాడులోని ప్రతిష్టాత్మక చిదంబర నటరాజ స్వామి ఆలయ సంపద వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ చర్యలను పురోహితులు ఒప్పుకోవడం లేదు. 1956 నుంచి ఆలయం సంపదను లెక్కలు చెప్పడానికి అర్చకులు ఒప్పుకోవడం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకు, భక్తులకు పారదర్శకంగా ఉండేందుకు సంపద వివరాలను చెప్పాలని కోరుతోంది. ఈ వ్యవహారం స్టాలిన్ సర్కార్ వర్సెస్ అర్చకుల మధ్య వివాదంగా మారింది.
1956 నుంచి సంపద లెక్కలను చెప్పడానికి అర్చకులు ఒప్పుకోలేదు. 2005 నుంచి 2022 వరకు ఉన్న సంపద వివరాలను మాత్రమే దేవాదాయశాఖ అధికారులు సేకరించారు. సంపద వివరాల సేకరణ పేరుతో కావాలనే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది అర్చకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు మరోసారి అధికారులు ఆలయానికి వెళ్లనున్నారు. చిదంబర ఆలయం నిర్వహణలో దీక్షితులదే ప్రధాన భాద్యత. ఇప్పటి వరకు ఆ దేవాలయం నిర్వహణలో దేవాదాయ శాఖ ఎప్పుడూ కలుగచేసుకోలేదు.
Also Read
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
Read Also: Dubai: ముస్లిం దేశంలో హిందూ ఆలయం.. దసరా సందర్భంగా ప్రారంభం
ఇదిలా ఉంటే స్టాలిన్ సర్కార్ వచ్చిన తర్వాత దేవాలయ ఆస్తులను లెక్కించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఆలయ ఆస్తులు లెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అధీనాధిపతులు, దీక్షితులు, అర్చకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎప్పుడు చెబుతుంటే ద్రావిడియన్ మోడల్ మాకు అవసరం లేదని ప్రభుత్వానికి అర్చకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. గత నెల నుంచి స్టాలిన్ ప్రభుత్వం, అర్చకుల మధ్య వివాదం రగులుతోంది.
భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన దేవాలయాల్లో చిదంబరం నటరాజస్వామి ఆలయం ఒకటి. తమిళనాడులోని కడలూర్ జిల్లాలో ఈ టెంపుల్ ఉంది. శివుడు ఇక్కడ నటరాజమూర్తి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఈ దేవాలయాన్ని 10వ శాతాబ్ధంలో చోళ సామ్రాజ్యం సమయంలో రాజులు నిర్మించారు. ఆ తరువాత పాండ్యులు కూడా దేవాలయాభివృద్ధికి తోడ్పాటును అందించారు. ద్రవిడియన్ శిల్పకళతో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
తాజావార్తలు
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!