Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండేళ్లలో నేరిడి బ్యారేజీ పూర్తి చేసి తీరతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత దశాబ్దాల కలయిన నేరిడి ప్రాజెక్టు సమస్యను కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పరిష్కరించిందని, వచ్చే రెండేళ్లలో పనులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, ప్రాంతీయ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనను కొనియాడుతూ.. ఐటీ, వ్యవసాయం, సాంకేతిక రంగాలలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్లే రాష్ట్రం వేగంగా పురోగమిస్తోందన్నారు. విజన్ స్వర్ణాంధ్ర 2047 దిశగా శ్రీకాకుళం ముందంజలో ఉందని.. పేదరిక నిర్మూలనకు చేపట్టిన పీ4 (P4) విధానంలో జిల్లా ‘ఎ’ గ్రేడ్ సాధించిందని వెల్లడించారు. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసి, 16,000 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశారని గుర్తుచేశారు.
Also Read
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
అదే సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిపై రామ్మోహన్ నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేయడం తప్ప జగన్కు వేరే పనిలేదని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం కూడా లేదని ఎద్దేవా చేశారు. గతంలో ఆయన సాగించిన విధ్వంసకర పాలన వల్లే ప్రజలు ఎన్నికల్లో ఓడించారని, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
-
Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!