Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకం… పరిస్థితిని గమనిస్తున్న అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు శాంతియుతంగా జరిగిన నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. ఓ వైపు గోటబయ సర్కార్ ఎమర్జెన్సీ విధించినా… ఆందోళనలు తగ్గడం లేదు. దాదాపుగా గత రెండు నెలల నుంచి శ్రీలంకలో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో పాటు గ్యాస్, పెట్రోల్ కొరతతో శ్రీలంక అల్లాడుతోంది.
ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా తరువాత శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీలంక హంబన్ టోటాలోని రాజపక్సేల పూర్వీకులు ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతో పాటు కాండీలోని మాజీ మంత్రి మిన్ కెహెలియా రాంబుక్వెల్లా ఇంటికి కూడా కాల్చేశారు. ఎంపీలు బందుల గుణవర్దన, ప్రసన్న రణతుంగ, చన్నా జయసుమన, కోకిల గుణవర్దన, అరుండికా ఫెర్నాండో, థిస్సా కుట్టియారాచ్చి, కనక హెరాత్, పవిత్ర వన్నీయారాచ్చి ఇళ్లపై కూడా దాడి జరిగింది. శ్రీలంకలో ఆందోళనల నేపథ్యంలో మంత్రులు, ఎంపీలను ఆర్మీ రహస్య ప్రదేశాలకు తరలిస్తోంది. దీంతో పాటు మాజీ ప్రధాని మహిందా రాజపక్సే, అధ్యక్షుడు గోటబయ రాజపక్సేలను వేరే దేశానికి తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సమస్యల పరిష్కారానికి ఆల్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మరోసారి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కోరాడు. దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబంగా ఉన్న రాజపక్సే కుటుంబ సభ్యులు గద్దె దిగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా చేయగా… అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కూడా తన పదవికి రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- 1991 Hijack: విమానం హైజాక్ జరిగితే, నిద్ర పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో..
- Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
- Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
- Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
ఇదిలా ఉంటే శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలను అమెరికా నిశితంగా గమనిస్తోంది. శ్రీలంకలో చెలరేగుతున్న హింసపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక, రాజకీయ సవాళ్లకు దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనాలని యూఎస్ డిపార్ట్మెంట్ శ్రీలంక ప్రజలను కోరింది.
తాజావార్తలు
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!