Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకం… పరిస్థితిని గమనిస్తున్న అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు శాంతియుతంగా జరిగిన నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. ఓ వైపు గోటబయ సర్కార్ ఎమర్జెన్సీ విధించినా… ఆందోళనలు తగ్గడం లేదు. దాదాపుగా గత రెండు నెలల నుంచి శ్రీలంకలో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో పాటు గ్యాస్, పెట్రోల్ కొరతతో శ్రీలంక అల్లాడుతోంది.
ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా తరువాత శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీలంక హంబన్ టోటాలోని రాజపక్సేల పూర్వీకులు ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతో పాటు కాండీలోని మాజీ మంత్రి మిన్ కెహెలియా రాంబుక్వెల్లా ఇంటికి కూడా కాల్చేశారు. ఎంపీలు బందుల గుణవర్దన, ప్రసన్న రణతుంగ, చన్నా జయసుమన, కోకిల గుణవర్దన, అరుండికా ఫెర్నాండో, థిస్సా కుట్టియారాచ్చి, కనక హెరాత్, పవిత్ర వన్నీయారాచ్చి ఇళ్లపై కూడా దాడి జరిగింది. శ్రీలంకలో ఆందోళనల నేపథ్యంలో మంత్రులు, ఎంపీలను ఆర్మీ రహస్య ప్రదేశాలకు తరలిస్తోంది. దీంతో పాటు మాజీ ప్రధాని మహిందా రాజపక్సే, అధ్యక్షుడు గోటబయ రాజపక్సేలను వేరే దేశానికి తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సమస్యల పరిష్కారానికి ఆల్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మరోసారి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కోరాడు. దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబంగా ఉన్న రాజపక్సే కుటుంబ సభ్యులు గద్దె దిగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా చేయగా… అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కూడా తన పదవికి రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Emmanuel Macron: భారత్ ఆవిష్కరణల దేశం.. మేక్ ఇన్ ఇండియాకు మా పూర్తి గౌరవం: మాక్రాన్
- War Effect: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఒమన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన 13 భారతీయ నౌకలు...
- PoK: ఆక్రమిత కాశ్మీర్ను ‘‘పంజాబ్’’గా మారుస్తున్న పాకిస్తాన్..
- Khawaja Asif: ఖురాన్తో బెదిరింపులు.. చంపేస్తామంటూ పాక్ రక్షణమంత్రి వార్నింగ్..
ఇదిలా ఉంటే శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలను అమెరికా నిశితంగా గమనిస్తోంది. శ్రీలంకలో చెలరేగుతున్న హింసపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక, రాజకీయ సవాళ్లకు దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనాలని యూఎస్ డిపార్ట్మెంట్ శ్రీలంక ప్రజలను కోరింది.
తాజావార్తలు
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
-
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
-
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!