Char Dham Yatra : ఛార్ ధామ్ యాత్రలో 31కి చేరిన మృతుల సంఖ్య… మౌంటైన్ సిక్ నెసే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛార్ ధామ్ యాత్రలో మృతుల సంఖ్య 31కి చేరిందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. మే 4న ఛార్ ధామ్ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 31 యాత్రికులు మరణించారని.. ఇందులో 30 మంది యాత్రికులు కాగా.. మరొకరు స్థానికంగా ఉండే వ్యక్తి అని ప్రభుత్వం ప్రకటించింది. 12 రోజుల్లోనే పదుల సంఖ్యలో యాత్రికులు మరణించారు.
మరణాలకు ‘మౌంటైన్ సిక్ నెస్’తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కారణమయ్యాయని ఉత్తరాఖండ్ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఎక్కువ మంది యాత్రికులు అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, మౌంటైన్ సిక్ నెస్ వ్యాధి వల్లే చనిపోయారని ఆరోగ్య శాఖ డీజీ డాక్టర్ శైలజా భట్ తెలిపారు.
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే సీఎం పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఛార్ ధామ్ యాత్రకు వచ్చే ప్రతీ యాత్రికుడి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యాత్రకు అనుమతించాలని ఆదేశించారు. దీంతో పలు రూట్లలో ప్రయాణికుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు స్ర్కీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రిషికేష్ ఐఎస్బీటీ, పండుకేశ్వర్ ప్రాంతాల్లో స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నారు.
పూర్తిస్థాయిలో ఫిట్ గా ఉన్న వాళ్లను మాత్రమే యాత్రకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని యాత్రకు రావాలని ప్రభుత్వం యాత్రీకులకు సూచిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!