Char Dham Yatra : ఛార్ ధామ్ యాత్రలో 31కి చేరిన మృతుల సంఖ్య… మౌంటైన్ సిక్ నెసే కారణం
ఛార్ ధామ్ యాత్రలో మృతుల సంఖ్య 31కి చేరిందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. మే 4న ఛార్ ధామ్ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 31 యాత్రికులు మరణించారని.. ఇందులో 30 మంది యాత్రికులు కాగా.. మరొకరు స్థానికంగా ఉండే వ్యక్తి అని ప్రభుత్వం ప్రకటించింది. 12 రోజుల్లోనే పదుల సంఖ్యలో యాత్రికులు మరణించారు.
మరణాలకు ‘మౌంటైన్ సిక్ నెస్’తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కారణమయ్యాయని ఉత్తరాఖండ్ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఎక్కువ మంది యాత్రికులు అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, మౌంటైన్ సిక్ నెస్ వ్యాధి వల్లే చనిపోయారని ఆరోగ్య శాఖ డీజీ డాక్టర్ శైలజా భట్ తెలిపారు.
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే సీఎం పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఛార్ ధామ్ యాత్రకు వచ్చే ప్రతీ యాత్రికుడి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యాత్రకు అనుమతించాలని ఆదేశించారు. దీంతో పలు రూట్లలో ప్రయాణికుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు స్ర్కీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రిషికేష్ ఐఎస్బీటీ, పండుకేశ్వర్ ప్రాంతాల్లో స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నారు.
పూర్తిస్థాయిలో ఫిట్ గా ఉన్న వాళ్లను మాత్రమే యాత్రకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని యాత్రకు రావాలని ప్రభుత్వం యాత్రీకులకు సూచిస్తోంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!