MahaRastra: ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరు మార్పు.. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MahaRastra: నగరాలు, పట్టణాలు, ప్రాంతాల పేర్లను మార్చడం ఉత్తర్ప్రదేశ్ నుంచి ఇపుడు మహారాష్ట్రకు పాకింది. రెండు, మూడు రోజుల క్రితం వెర్సోవాబాంద్రా సీలింక్ కు సావర్కర్ సేతుగా నామకరణం చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ముంబై ట్రాన్స్హార్బర్ లింక్కు మాజీ ప్రధాని వాజ్పాయ్ స్మృతి నవసేన అటల్ సేతు అని పేరు ఖరారు చేసింది. ఇప్పుడు ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read also:
Monsoon Food Tips: వర్షాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకొవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం!
Also Read
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ రైల్వే స్టేషన్గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాటలో ప్రయాణిస్తున్నారు. సీఎం యోగి లాగానే.. షిండే కూడా నగరాలు, వంతెనల పేర్లు మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ పలు నగరాల, వంతెనల పేర్లు మార్చింది. తాజాగా రైల్వేస్టేషన్ పేరును మార్చుతున్నట్టు షిండే సర్కార్ ప్రకటన చేసింది. నాగ్ పూర్ జిల్లాలోని ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ’ స్టేషన్ గా మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే కృష్ణ ఖోప్డే సమాచారం ఇచ్చారు.
Read also: Devara : ‘దేవర’ పార్ట్ 1 కంప్లీటే కాలేదు అప్పుడే పార్ట్ 2?
బిజెపి ఎమ్మెల్యే కృష్ణ ఖోప్డే మీడియాతో మాట్లాడుతూ.. నాగ్ పూర్ జిల్లాలోని ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ స్టేషన్ గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఇందుకు సంబంధించి మే 23న హోం మంత్రిత్వ శాఖ నుంచి పేరు మార్పునకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందించిందనీ.. అలాగే.. జూన్ 16న రాష్ట్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని నాగ్పూర్ తూర్పు తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులు అర్పించడంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. మహారాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్ గా, ఉస్మానాబాద్ నగరానికి ధరాశివ్ గా, అహ్మద్నగర్ ను అహల్యాదేవి హోల్కర్గా పేరు మార్చిన విషయం తెలిసిందే. అలాగే.. మూడు రోజుల క్రితం వెర్సోవాబాంద్రా సీలింక్ కు వీడీ సావర్కర్ సేతుగా నామకరణం చేసింది. దాంతోపాటు ముంబై ట్రాన్స్హార్బర్ లింక్కు మాజీ ప్రధాని వాజ్పాయ్ స్మృతి నవసేన అటల్ సేతు అని పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్కు చేరిన ఓపెనర్స్..
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్పే, పేటీఎంకు పోటీగా సేవలు!
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!