Manmohan Singh: మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మించేది ఇక్కడేనా.. కేంద్రం చర్యలు..
- మన్మోహన్ సింగ్ స్మారక నిర్మాణంపై కేంద్రం చర్యలు..
- నెహ్రూ-గాంధీ స్థలాలకు సమీపంలో స్మారకం ఉండే అవకాశం..
- రాజ్ఘాట్, కిసాన్ ఘాట్ సమీపంలో సైట్ని ఎంచుకోనున్న మన్మోహన్ సింగ్ కుటుంబం..
Manmohan Singh: భారత మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరున్న మన్మోహన్ సింగ్ ఇటీవల మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఆయన స్మారక చిహ్నంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. అయితే, కేంద్రం తాజాగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రక్రియ ప్రారంభించింది. సోర్సెస్ ప్రకారం.. రాజ్ఘాట్, రాష్ట్రీయ స్మృతి స్థల్ లేదా కిసాన్ ఘాట్ సమీపంలో 1 నుండి 1.5 ఎకరాల స్థలం స్మారక చిహ్నం కోసం ప్రతిపాదించబడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలను ఇప్పటికే పట్టణాభివృద్ధి శాఖ అధికారులు పరిశీలించారు. ఈ రెండు స్థలాల్లో ఒకటి ఎంచుకోవాలని మన్మోహన్ కుటుంబ సభ్యులకు అధికారులు సూచించినట్లు సమాచారం.
Read Also: Mid-Size SUV: 2024లో అత్యంత ప్రజా దారణ పొందిన కారు ఇదే..
Also Read
కొత్త విధానం ప్రకారం.. స్మారక చిహ్నం కోసం భూమిని ట్రస్ట్కి మాత్రమే కేటాయించవచ్చు. ప్రాజెక్టు ప్రారంభించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు తప్పనిసరి. ట్రస్ట్ స్థాపించిన తర్వాత, భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేస్తుంది. నిర్మాణం కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD)తో ఒక ఎంఓయూ సంతకం చేస్తుంది.
జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీల స్మారకాలు ఉన్న రాజ్ఘాట్కి సమీపంలో స్మారక చిహ్నం ఉండే అవకాశం ఉంది. మన్మోహన్ సింగ్ మరణం తర్వాత అంత్యక్రియలు, స్మారక చిహ్నం నిర్మాణంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్మారక చిహ్నం కేటాయించే చోటనే మాజీ ప్రధాని అంత్యక్రియాలు నిర్వహించాలని తాము చేసిన డిమాండ్ని బీజేపీ తిరస్కరించిందని కాంగ్రెస్ విమర్శించింది. అయితే, మన్మోహన్ సింగ్ మరణాన్ని కూడా కాంగ్రెస్ ‘‘రాజకీయం’’ చేస్తుందని బీజేపీ ప్రతిగా స్పందించింది.
తాజావార్తలు
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
-
Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో