Manmohan Singh: మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మించేది ఇక్కడేనా.. కేంద్రం చర్యలు..
- మన్మోహన్ సింగ్ స్మారక నిర్మాణంపై కేంద్రం చర్యలు..
- నెహ్రూ-గాంధీ స్థలాలకు సమీపంలో స్మారకం ఉండే అవకాశం..
- రాజ్ఘాట్, కిసాన్ ఘాట్ సమీపంలో సైట్ని ఎంచుకోనున్న మన్మోహన్ సింగ్ కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh: భారత మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరున్న మన్మోహన్ సింగ్ ఇటీవల మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఆయన స్మారక చిహ్నంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. అయితే, కేంద్రం తాజాగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రక్రియ ప్రారంభించింది. సోర్సెస్ ప్రకారం.. రాజ్ఘాట్, రాష్ట్రీయ స్మృతి స్థల్ లేదా కిసాన్ ఘాట్ సమీపంలో 1 నుండి 1.5 ఎకరాల స్థలం స్మారక చిహ్నం కోసం ప్రతిపాదించబడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలను ఇప్పటికే పట్టణాభివృద్ధి శాఖ అధికారులు పరిశీలించారు. ఈ రెండు స్థలాల్లో ఒకటి ఎంచుకోవాలని మన్మోహన్ కుటుంబ సభ్యులకు అధికారులు సూచించినట్లు సమాచారం.
Read Also: Mid-Size SUV: 2024లో అత్యంత ప్రజా దారణ పొందిన కారు ఇదే..
Also Read
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
కొత్త విధానం ప్రకారం.. స్మారక చిహ్నం కోసం భూమిని ట్రస్ట్కి మాత్రమే కేటాయించవచ్చు. ప్రాజెక్టు ప్రారంభించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు తప్పనిసరి. ట్రస్ట్ స్థాపించిన తర్వాత, భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేస్తుంది. నిర్మాణం కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD)తో ఒక ఎంఓయూ సంతకం చేస్తుంది.
జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీల స్మారకాలు ఉన్న రాజ్ఘాట్కి సమీపంలో స్మారక చిహ్నం ఉండే అవకాశం ఉంది. మన్మోహన్ సింగ్ మరణం తర్వాత అంత్యక్రియలు, స్మారక చిహ్నం నిర్మాణంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్మారక చిహ్నం కేటాయించే చోటనే మాజీ ప్రధాని అంత్యక్రియాలు నిర్వహించాలని తాము చేసిన డిమాండ్ని బీజేపీ తిరస్కరించిందని కాంగ్రెస్ విమర్శించింది. అయితే, మన్మోహన్ సింగ్ మరణాన్ని కూడా కాంగ్రెస్ ‘‘రాజకీయం’’ చేస్తుందని బీజేపీ ప్రతిగా స్పందించింది.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!