Arvind Kejriwal: కేజ్రీవాల్కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాక్..
- కేజ్రీవాల్ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చిన కేంద్రం హోంశాఖ..
- ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై ఉన్న అరవింద్ కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజా ప్రతినిధుల్ని విచారించేందుకు ఈడీ ముందస్తు పర్మిషన్ పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్లో ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేజ్రీవాల్ను విచారణ చేసేందుకు ఓకే చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also: Hyderabad: రాచకొండ పరిధిలో గన్స్ విక్రయం.. మూడు తుపాకులు స్వాధీనం..
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
అయితే, 2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్పై కేసు నమోదైంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 2024 మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయగా.. 6 నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించిన తర్వాత 2024 సెప్టెంబర్లో అతడికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. బెయిల్ పొందిన కొద్ది రోజులకే, కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికీ రాజీనామా చేశారు. అతడి స్థానంలో అతిషి మార్లెనా సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కాగా, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజవర్గాలకు ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లలో విజయం సాధించగా.. బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలవగా.. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..