Arvind Kejriwal: కేజ్రీవాల్కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాక్..
- కేజ్రీవాల్ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చిన కేంద్రం హోంశాఖ..
- ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై ఉన్న అరవింద్ కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజా ప్రతినిధుల్ని విచారించేందుకు ఈడీ ముందస్తు పర్మిషన్ పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్లో ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేజ్రీవాల్ను విచారణ చేసేందుకు ఓకే చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also: Hyderabad: రాచకొండ పరిధిలో గన్స్ విక్రయం.. మూడు తుపాకులు స్వాధీనం..
Also Read
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
అయితే, 2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్పై కేసు నమోదైంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 2024 మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయగా.. 6 నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించిన తర్వాత 2024 సెప్టెంబర్లో అతడికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. బెయిల్ పొందిన కొద్ది రోజులకే, కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికీ రాజీనామా చేశారు. అతడి స్థానంలో అతిషి మార్లెనా సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కాగా, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజవర్గాలకు ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లలో విజయం సాధించగా.. బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలవగా.. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
తాజావార్తలు
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..